Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీట్ యుజీ 2021లో అత్యుత్తమంగా ఆల్ ఇండియా ర్యాంక్ 221 సాధించాడు
- అత్యంత ప్రతిష్టాత్మకమైన వైద్య విద్య ప్రవేశ పరీక్షలో 720కు గాను 696 సాధించిన ఈశ్వర్ చౌదరి
విజయవాడ: విజయవాడలోని ఆకాష్ ఇనిస్టిట్యూట్ విద్యార్ధి ఈశ్వర్ చౌదరి, ఇనిస్టిట్యూట్కు గర్వకారణంగా నిలుస్తూ అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ ప్రవేశ పరీక్ష (నీట్) యుజీ 2021లో ఆల్ ఇండియా ర్యాంక్ 221 సాధించి తన తల్లిదండ్రులకు, ఇనిస్టిట్యూట్ వద్ద మొత్తం సిబ్బందికి గర్వకారణంగా నిలిచాడు. ప్రతిష్టాత్మకమైన వైద్య ప్రవేశ పరీక్షలో 720కు గాను 696 మార్కులు అతను సాధించాడు. ఈ ఇనిస్టిట్యూట్ నుంచి మంచి ర్యాంకులు సాధించిన ఇతర విద్యార్థులలో అంబికా గోవింద్, వి కిరణ్ సాయి, స్టీవ్ జోషువా, క్షితిజా ప్రియ ఉన్నారు. బైపీసీ విద్యార్ధిని అంబికా గోవింద్ నీట్లో 667 మార్కులతో పాటుగా ఇంజినీరింగ్ అడ్వాన్స్ పరీక్షలలో సైతం 5680 ర్యాంక్ సాధించినందుకు యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది.
ప్రపంచంలో అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటిగా గుర్తింపు పొందిన నీట్లో ర్యాంకు సాధించేందుకు ఆకాష్ ఇనిస్టిట్యూట్లో రెండు సంవత్సరాల క్లాస్రూమ్, లైవ్ ప్రోగ్రామ్ లో ఈశ్వర్ చేరాడు. కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం, అభ్యాస షెడ్యూల్స్కు ఖచ్చితంగా కట్టుబడి ఉండటం కారణంగానే టాప్ పర్సంటైల్ సాధించిన వారి సరసన తాను నిలువగలిగానన్నాడు. ‘‘ఆకాష్ ఇనిస్టిట్యూట్ నాకు ఈ రెండు అంశాలలోనూ ఎంతగానో తోడ్పడింది. వారి కోచింగ్, కంటెంట్ కారణంగానే అతి తక్కువ సమయంలోనే విభిన్నమైన బోధనాంశాలను మెరుగ్గా ఆకలింపు చేసుకోవడం సాధ్యమైంద’’ని అతను వెల్లడించాడు.
ఈశ్వర్ను అభినందించిన ఆకాష్ చౌదరి, మేనేజింగ్ డైరెక్టర్, ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్) మాట్లాడుతూ ‘‘ అసాధారణ ప్రతిభ కనబరిచిన ఈశ్వర్ను మేము అభినందిస్తున్నాము. దేశ వ్యాప్తంగా నీట్ 2021 కోసం 16 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. అతను సాధించిన విజయం, అతని కష్టం, అంకిత భావం తో పాటుగా అతని తల్లిదండ్రుల మద్దతు గురించి పుంఖానుపుంఖాలుగా వెల్లడిస్తుంది. భవిష్యత్లో మరిన్ని విజయాలను అతను సాధించాలని ఆకాంక్షిస్తున్నాము’’ అని అన్నారు.
ఆయనే మాట్లాడుతూ, మహమ్మారి కాలంలో ఆకాష్ ఇనిస్టిట్యూట్ ఓ అడుగు ముందుకువేసి విద్యార్థులు నీట్ లో మంచి పర్సంటైల్ స్కోర్స్ సాధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ‘‘మా విద్యార్థులకు డిజిటల్గా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకున్నాం. స్టడీ మెటీరియల్స్, క్వశ్చన్ బ్యాంక్స్ను ఆన్లైన్లో అందుబాటులో ఉంచాము. వర్ట్యువల్గా మోటివేషనల్ సదస్సులు, పరీక్షలకు సంసిద్ధం కావడంపై సెమినార్లు, టైమ్ మేనేజ్మెంట్ నైపుణ్యంపై సదస్సులు నిర్వహించాం. మా కష్టం ఫలించడం పట్ల చాలా సంతోషంగా ఉంది. మా విద్యార్థులు సాధించిన స్కోర్ షీట్స్లో అది ప్రతిబింబిస్తుంది. మా విద్యార్థులలో చాలామంది భారతదేశంలో అగ్రశ్రేణి మెడికల్ కాలేజీలలో ప్రవేశాలు పొందగలరు’’అని అన్నారు. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ (ఎంబీబీఎస్), డెంటల్ (బీడీఎస్), ఆయుష్ (బీఏఎంఎస్, బీయుఎంఎస్, బీహెచ్ఎంఎస్ మొదలైనవి) కోర్సులలో భారతదేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఇనిస్టిట్యూట్లలో ప్రవేశం కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతి సంవత్సరం నీట్ ను అర్హత పరీక్షగా నిర్వహిస్తుంది.