Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: సుప్రసిద్ధ అంతర్జాతీయ ఐటీ సేవలు, కన్సల్టింగ్, వ్యాపార పరిష్కారాల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నిర్వహించిన రూరల్ ఐటీ క్విజ్–2021 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనల్స్లో కృష్ణా జిల్లాలోని కొమ్మారెడ్డి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థి విజేతగా నిలిచాడని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ, కర్నాటక రాష్ట్ర ఐటీ, బీటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల సహకారంతో టీసీఎస్ ఈ 22వ ఎడిషన్ క్విజ్ను నిర్వహించింది. ఈ సంవత్సరం ఈ క్విజ్లో వర్ట్యువల్ విధానంలో పాల్గొనే అవకాశం కల్పించారు. ఆన్లైన్లో పరీక్షలకు వారు హాజరుకావడంతో పాటుగా వర్ట్యువల్గానే క్విజ్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు పాఠశాలలకు చెందిన 8–12 వ తరగతి విద్యార్థులు పాల్గొన్న ఈ క్విజ్లో ప్రాధమిక ఆన్లైన్ టెస్ట్ తరువాత ఆరుగురు విద్యార్థులను వర్ట్యువల్ ఫైనల్స్కు ఎంపిక చేశారు. ఈ ఫైనల్స్ ఐదు విభాగాలు – బైట్ క్లౌడ్స్, బైట్ రికగ్నైజేషన్ , బైట్ కంటెక్ట్స్, బోర్డర్లెస్ బైట్స్, బైట్స్ ఏజిల్–గా నిర్వహించారు. తద్వారా వారి ఐటీ పరిజ్ఞానం పరీక్షించారు.
రూరల్ ఐటీ క్విజ్, ఆంధ్రప్రదేశ్ విజేతలు...
· విజేత – గణేష్ భరద్వాజ్, కొమ్మారెడ్డి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, కృష్ణా జిల్లా
· ద్వితీయ స్ధానం – పట్నాల హరితేజ, ఏపీ మోడల్ స్కూల్, తమడ
విజేతకు 10వేల రూపాయల విలువ కలిగిన బహుమతులు,ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి 7వేల రూపాయల విలువ కలిగిన ఓచర్లు అందించారు. రూరల్ ఐటీ క్విజ్ను 2000 సంవత్సరం నుంచి టీసీఎస్ నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం నిర్వహించిన క్విజ్ను ఎనిమిది రాష్ట్రాలు – గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్, మధ్య ప్రదేశ్, రాజస్తాన్, ఉత్తర్ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్నాటక–లలో నిర్వహించారు. ఈ రాష్ట్రాల విజేతలు నవంబర్లోనే నిర్వహించే జాతీయ స్థాయి ఫైనల్స్లో పోటీపడతారు. జాతీయ స్థాయి విజేతలకు ఒక లక్ష రూపాయల విలువ కలిగిన స్కాలర్షిప్ను అందజేస్తారు.