Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుంటూరు: విజయవాడ, విశాఖపట్నం తర్వాత ఈ నూతన క్లినిక్ రాష్ట్రంలో మూడవది; గుంటూరు నగరంలో చాలా తక్కువ TFR (మొత్తం సంతానోత్పత్తి రేటు) 1.5ను పరిష్కరించడంపై ఈ కేంద్రం దృష్టి సారిస్తుంది డిసెంబర్ 2021 నాటికి ఒంగోలు, ఏలూరు, కర్నూలు, తిరుపతిలో ప్రారంభిచబడుతుంది. వచ్చే మూడేండ్లలలో భారతదేశంలోని 50 కేంద్రాలతో నెట్వర్క్ను రెట్టింపు చేయాలని యోచిస్తోంది.
దంపతులకు వారి పేరెంట్హుడ్ కలలలోను సాకారం చేసుకునేందుకు స్థిరమైన, ప్రపంచ స్థాయి సంతానోత్పత్తి చికిత్సలను అందిస్తూ భారతదేశంలో IVF సేవల విభాగంలో కీలక పాత్ర పోషించడానికి మంచి అవకాశం ఉంది. రిప్రొడక్టివ్ మెడిసిన్, అడ్వాన్స్డ్ ఇన్ఫెర్టిలిటీ చికిత్సల రంగంలో అత్యంత విశ్వసనీయ సంస్థ అయిన ఒయాసిస్ ఫెర్టిలిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంస్థ విస్తరణలో భాగంగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఐవీఎఫ్ సెంటర్ను గుంటూరులో ప్రారంభించారు. విజయవాడ, విశాఖపట్నం తర్వాత రాష్ట్రంలో ఒయాసిస్ ఫెర్టిలిటీకి ఇది మూడో క్లినిక్.
అన్ని రకాల సమర్ధవంతమైన, ఖచ్చితమైన సంతానోత్పత్తి చికిత్సలను అందించడానికి ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఒయాసిస్ ఫెర్టిలిటీ సహ వ్యవస్థాపకులు మరియు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా జి రావు, సైంటిఫిక్ హెడ్, క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చైతన్యలు విజయవాడ, గుంటూరులో క్లినికల్ హెడ్లు డాక్టర్ సుజాత వెల్లంకి, డాక్టర్ రమ్య విచారపు తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జీజీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ ప్రభావతి, MD, DGO, గుంటూరు జాయింట్ కలెక్టర్ జి.రాజ కుమారి హాజరయ్యారు.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే యొక్క ఇటీవలి అధ్యయనం ప్రకారం భారతదేశంలో ప్రస్తుత సంతానోత్పత్తి రేటు (2021) ప్రతి స్త్రీకి 2.179 జననాలు కాగా, ఆంధ్రప్రదేశ్ మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) 1.7. గా ఉంది. అలాగే, గుంటూరు నగరం ప్రస్తుతం 1.5 తక్కువ TFRని కలిగి ఉండటం సందేహాస్పదంగా ఉంది. గుంటూరులో మహిళల ఆరోగ్యం క్షీణించడంతో పాటు పురుషుల సంతానోత్పత్తి సమస్యలు కూడా దీనికి ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి తోడు గుంటూరు నగరంలో ఒత్తిడి, ఊబకాయం, ఆలస్య వివాహాలు వంటి జీవనశైలి కారకాలు పెరుగుతున్నాయి. అంతేకాకుండా పురుగుమందుల ప్రభావం కూడా పురుషులలో సంతానోత్పత్తి సమస్యలకు కారణమవుతుంది.
గుంటూరు నూతన క్లినిక్ను ప్రారంభించిన సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ సహ వ్యవస్థాపకులు మరియు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా జి రావు మాట్లాడుతూ, “గుంటూరులో ఈ అత్యాధునిక ఐవీఎఫ్ కేంద్రం ప్రారంభిచడం మాకు చాలా ఆనందంగా ఉంది. అనుభవజ్ఞులైన క్లినికల్, ఎంబ్రియాలజీ బృందంచే ఈ క్లినిక్ నిర్వహించబడుతుంది. వంధ్యత్వ చికిత్సను కోరుకునే జంటలకు స్థిరమైన, ప్రపంచ-స్థాయి చికిత్సలను అందించడానికి మా లాంటి సంస్థాగతమైన ఏర్పాట్టు, వృత్తిపరంగా నడిచే సంస్థలు ఎంతో అవసరం.