Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఔషధ తయారీలో ఉన్న లీ హెల్త్ డొమెయిన్ సరైన జీర్ణ వ్యవస్థ కోసం ఎంజైమ్యాక్ట్ పేరుతో క్యాప్సూల్స్ను ప్రవేశపెట్టింది. శాఖాహార పదార్థాల నుంచి సేకరించిన ఎంజైమ్స్ అమిలేజ్, ప్రొటీజ్, లైపేజ్లతో ఈ ఉత్పాదనను తయారు చేసినట్టు కంపెనీ డైరెక్టర్ లీలా రాణి ఓ ప్రకటనలో తెలిపారు. విదేశాలకూ ఈ ఔషధాన్ని ఎగుమతి చేస్తామన్నారు. 'ప్యాంక్రి యాటిక్ ఎక్సోక్రిన్ లోపం ఉన్న వ్యక్తులకు డైజెస్టివ్ ఎంజైమ్లు లేకపోవ డం, సిస్టిక్ ఫైబ్రోసిస్, ప్యాంక్రియాస్ తొలగించడం, దీర్ఘకాలిక ప్యాంక్రి యాటిటిస్ కారణంగా ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోలేరు. మార్కెట్లో ఉన్న జంతు కణ ఆధారిత ప్యాంక్రియాటిన్ ఔషధంతో సమస్యలు వస్తున్నాయి. అలాగే మందుల అవశేషాలు స్టెరాయిడ్స్, యాంటీబయా టిక్స్ ఉండే అవకాశం ఉంది. అందుకే శాఖాహార ఆధారిత ప్యాంక్రి యాటిన్తో ఎంజైమ్యాక్ట్ తయారు చేశాం. శాఖాహార ప్యాంక్రియాటిన్ 2-10పిహెచ్ స్థాయిల్లో,జంతుకణ ఆధారిత ప్యాంక్రియాటిన్ 2-3, 7-9 పిహెచ్ స్థాయిల వద్ద పనిచేస్తుంది' అని తెలిపారు.