Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పర్యావరన పరిరక్షణ కోసం తన నిబద్దతను చాటుకుంటున్న ప్రముఖ సంస్థలు ఎంబీ పవర్, ఏసీసీ సిమెంట్ లు జతకట్టాయి. విభిన్న విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎంబి పవర్ మధ్యప్రదేశ్ కట్ని కైమోర్లోని ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీకి రైల్వేల ద్వారా కండిషన్డ్ ఫ్లైయాష్ (సిఎఫ్ఎ) సరఫరాలను ప్రారంభించింది.
మధ్య ప్రదేశ్లోని షాదోల్ డివిజన్ నుంచి ఫ్లై యాష్తో తొలి గూడ్స్ రైలుకు ఎంబి పవర్ ఫ్లాంట్ హెడ్, సిఓఓ బికె మిశ్రా సమక్షంలో షాదోల్ డివిజన్ కమిషనర్ రాజీవ్ శర్మ, అనుప్పర్ జిల్లా, కలెక్టర్ సోనియా మీనా జెండా ఊపి ప్రారంభించారు. ఎంబి పవర్ మధ్య ప్రదేశ్ అనుప్పూర్ జైతారిలోని తన ప్రధాన థర్మల్ విద్యత్ కేంద్రం నుంచి సిఎఫ్ ను, ఎసిసి సిమెంట్కు రవాణా చేస్తుంది. ఆవిధంగా ఫ్లైయాష్ను సక్రమ వినియోగానికి అవకాశం కలుగుతుంది. దేశంలో ఇటువంటి చొరవ తీసుకున్న కొన్ని కేంద్రాలలో ఎంబీ పవర్ అనుప్పూర్ ప్లాంట్ ఒకటి.