Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి మరోసారి ధరలను పెంచాలని నిర్ణయించింది. ఇటీవల వరుసగా ముడి సరుకుల ధరలు పెరిగినందును ఆ భారాన్ని వినియోగదారులపై మోపనున్నట్లు స్పష్టం చేసింది.ఈ క్రమంలోనే కొత్త ఏడాది జనవరి నుంచి తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడించింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-22)లో మారుతి నాలుగో దఫాలుగా వివిధ మోడళ్ల కార్ల ధరల పెంచింది. వచ్చే జనవరి నుంచి అమలు చేయనున్న నూతన ధరలు ఆయా మోడళ్లను బట్టి తేడా ఉంటుందని పేర్కొంది. కాగా.. ఎంతా అనేది స్పష్టతనివ్వలేదు. గత ఏడాది కాలంగా వివిధ రకాల ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని.ఈ తరుణంలో పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని ధరల పెంపు ద్వారా వినియోగదారులపై మోపనున్నట్లు మారుతి సుజుకి పేర్కొ ంది.హ్యాచ్బ్యాక్ ఆల్టో నుంచి ఎస్-క్రాస్ ఎస్యువి మోడల్ వరకు వివిధ శ్రేణుల కార్లను మారుతి సుజుకి తయారు చేస్తున్నది. ఇంతక్రితం సెప్టెంబర్లో పలు మోడల్ కార్లపై ధరలను రూ.10-25వేల వరకు పెంచింది.