Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: మింత్ర తన ద్వైవార్షిక ఇఓఆర్ఎస్ 15వ ఎడిషన్ దేశంలోని భారీ ఫ్యాషన్ కార్నివాల్ కానుండగా, కొత్త ఏడాది నేపథ్యంలో లక్షలాది మంది కొనుగోలుదారులకు ఉత్సాహాన్ని అందించేందుకు వస్తోంది. ఇఓఆర్ఎస్ డిసెంబరు 18 నుంచి 23 వరకు కొనసాగనుంది. కొనుగోలుదారులకు గతంలో ఎన్నడూ చూడని అత్యంత భారీ ఇఓఆర్ఎస్ కలెక్షన్ను అందిస్తుండగా, 5000కు పైగా బ్రాండ్లను 1 మిలియన్ స్టైళ్లలో మహోన్నతమైన విలువతో అందించనుంది. ఈ 6-రోజుల కార్యక్రమం దేశ వ్యాప్తంగా 40 లక్షలకు పైచిలుకు ప్రత్యేక వినియోగదారులకు ఫ్యాషన్, సౌందర్యం, జీవన శైలి అవసరాలకు కావలసిన ఉత్పత్తులను అందించేందుకు సిద్ధం కాగా, బిఏయు (BAU) రోజుల్లో డిమాండ్ 2.5 రెట్లు ఎక్కువ అయ్యే నిరీక్ష ఉంది. గత చలికాలంలోని ఎడిషన్ కన్నా మింత్ర ఈ కార్యక్రమం అవధిలో 700 వేల కొత్త వినియోగదారులను నిరీక్షిస్తుండగా, టైయర్ 2, టైయర్ 3 మరియు పట్టణాల నుంచి 45% ట్రాపిక్ ఉంటుందని అంచనా. బాధ్యతాయుతమైన కార్పొరేట్ సంస్థగా మింత్ర సంస్థ తన సొంత అలవాట్లతో ప్రభుత్వం సూచించిన అన్ని సురక్షత నియమాలు, మార్గసూచికలకు దృఢంగా కట్టుబడి ఉంది. భౌతిక అంతరాన్ని కాపాడేందుకు మింత్ర తీసుకున్న వివిధ చర్యలతో నగదు రహిత, స్పర్శ రహిత డెలివరీలను ఉత్తేజిస్తోంది.
గ్రీన్ ఇఓఆర్ఎస్-మింత్ర తిరిగి ఉపయోగించదగిన కాగితంతో ప్యాకేజింగ్ డెలివరీ తయారు చేయడం ద్వారా ప్లాస్టిక్ రహితంగా ఉంది. దేశంలోని ఫ్యాషన్, లైఫ్స్టైల్ మరియు సౌందర్య రంగాల్లో మింత్ర తన విక్రయ ఎకోసిస్టమ్ను సుస్థిరమైన ప్యాకేజింగ్ ప్రత్యామ్నాయాలను అలవర్చుకునేందుకు సిద్ధం చేసేందుకు నేతృత్వాన్ని వహించింది. దీనితో మింత్ర ఉత్పత్తులను కుషనింగ్కు తిరిగి ఉపయోగించేందుకు అవకాశం ఉన్న కాగితాన్ని వినియోగిస్తుంది. ఇక్కడ సాధ్యమైనంత మేర లోపలి ప్యాకేజింగ్లో ప్లాస్టిక్ను తొలగించింది. సుస్థిరతకు సంబంధించిన తన ప్రయత్నాలకు ఉత్తేజనాన్ని అందించే దిశలో మింత్ర బిలాస్పూర్ మరియు భివండిలలో ఉన్న తన అత్యంత పెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు సౌరశక్తిని వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారు.
వినియోగదారులు దేన్ని నిరీక్షింవచ్చు?
వినియోగదారులు తమకు అత్యంత ఇష్టమైన ఫ్యాషన్వేర్, సౌందర్య సంబంధిత ఉత్పత్తులు, యాక్ససరీలు, గృహాలంకరణ తదితర ఉత్పత్తులను హెచ్అండ్ఎం, మ్యాంగో, లెవిస్, పుమా, నైకి, రోడ్స్టర్, మామా ఎర్త్, అర్బానిక్ బిమా తదితర బ్రాండ్ల శ్రేణి నుంచి సాధ్యమైనంత ఉత్తమ ధరల్లో ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇఓఆర్ఎస్ ఈ డిసెంబరు ఎడిషన్లో స్థానిక మరియు అంతర్జాతీయ బ్రాండ్లే కాకుండా సౌందర్యం, చర్మం, శిరోజాల సంరక్షణ ఉత్పత్తుల స్థానిక మరియు అంతర్జాతీయ శ్రేణి నుంచి ట్రెండీ వింటర్వేర్ను కొనుగోలు చేసుకునే అత్యుత్తమ అవకాశాన్ని కూడా ఇస్తోంది.
తన ఆమ్ని నెట్వర్కును మరింత విస్తరిస్తూ, మింత్ర 350+ బ్రాండ్లు మరియు 2900+ స్టోర్లను దేశ వ్యాప్తంగా తన ఆమ్ని-ఛానెల్ డెలివరీ మోడల్లో సంయోజించగా గత మూడు నెలల్లో స్టేటస్ కో, ఉడ్ల్యాండ్, సోచ్, కొలంబియా తదితరాలు ఇందులో ఉన్నాయి. మింత్ర ఆమ్ని ఛానెల్ నెట్వర్కు స్టోర్ల నుంచి వినియోగదారుల ఇంటి వాకిలి వరకు ఉత్పత్తులను నేరుగా అందిస్తుండగా, బ్రాండ్లకు విస్తృత స్థాయిలో వినియోగదారులను సురక్షిత విధానంలో చేర్చేందుకు అవకాశాన్ని కల్పించింది.
మింత్రా ఇటీవలే స్టైల్ కాస్ట్ను ప్రారంభించగా మింత్ర యాప్లో జెన్-జడ్ కొనుగోలుదారులకు ప్రత్యేకమైన వలయం కాగ 60కు పైగా ఎక్కువ బ్రాండ్లు పాల్గొనడాన్ని ఇందులో చూడవచ్చు. స్టైల్ కాస్ట్ ఇఓఆర్ఎస్ వింటర్ వండర్ల్యాండ్, రొమాంటిజం మంది వింటర్ క్రష్ వస్తువుల చుట్టూ 3000 స్టైళ్లకు పైగా ఆఫర్లను ఇవ్వనుంది.
చివరి దశ వితరణకు వ్యాప్తి, ఎన్హ్యాన్స్మెంట్లు
మింత్ర కిరాణా మోడల్ దేశ వ్యాప్తంగా పిన్కోడ్లకు ఉత్పత్తులను వితరణ చేస్తుండగా, వారి ఆదాయాలకు ఉత్తేజన అందిస్తోంది. మింత్రకు 25000 కిరాణా భాగస్వాములు, ఫ్రాంఛాయిసీలతో సహా ఈ ఇఓఆర్ఎస్ 80% మేర అన్ని డెలివరీలను వితరణ చేయనుంది. మింత్రా కిరాణా మోడల్ దుకాణం యజమానులకు ప్రత్యామ్నాయ ఆదాయవనరును అందిస్తుంది మరియు జీవనోపాధిని ఇఓఆర్ఎస్ సమయంలో డెలివరీలను ఎక్కువ చేసుకోవడం ద్వారా విస్తరిస్తుంది. మింత్ర ఆమ్ని ఛానెల్ నెట్వర్కు బ్రాండ్ భాగస్మామి దుకాణాల నుంచి వినియోగదారుల ఇంటి వాకిలి వద్దే ఉత్పత్తులను నేరుగా అందించడాన్ని సాధ్యం చేయడం ద్వారా విస్తృత ప్రమాణంలో వినియోగదారులకు సురక్షితమైన విధానంలో చేర్చుతుంది.
ఇఓఆర్ఎస్ సమయంలో ఎర్లీ బర్డ్ ప్రయోజనాలు
మింత్ర తన ఆవిష్కారాత్మక కార్యక్రమాలైన ‘ప్రైస్ రివీల్’ మరియు ‘ఎర్లీ యాక్సెస్’లను డిసెంబరు 17 నాటి కార్యక్రమంలో ఆఫర్గా కొనసాగించనుండగా, ఇందులో మింత్ర లాయల్టి కార్యక్రమం ఎలైట్ మరియు ఐకాన్ వినియోగదారులు ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైన ప్రారంభిక యాక్సెస్ను ఆనందిస్తారు, ఇతరులు ఈ ఎంపికను కోరుకున్నట్లయితే కొంత నామమాత్రపు రుసుము చెల్లించవలసి ఉంటుంది. మొదటిసారి కొనుగోలు చేసుకునే వారు నెల రోజులు ఉచిత డెలివరీ మాత్రమే కాకుండ రూ.500 తగ్గింపునూ అందుకుంటారు. ఎలైట్, సెలెక్ట్ మరియు ఐకాన్ ఇన్సైడర్లు ఈ పూర్తి కార్యక్రమం అవధిలో ఉచిత షిప్పింగ్ సదుపాయాన్ని ఆస్వాదించవచ్చు.
ఇన్సైడర్లు 150+ బ్రాండ్లపై 20% మేర ఆఫర్లను కూడా పొందవచ్చు మరియ ఇన్సైడర్ పాయింట్లను ఉపయోగించుకుని అగ్రగామి బ్రాండ్ల వోచర్లను మరోసారి వినియోగించుకోవచ్చు. మింత్ర ‘షౌట్ అండ్ ఎర్న్’ కార్యక్రమం వినియోగదారులకు వారి మిత్రులను ఇఓఆర్ఎస్కు ఆహ్వానించే మరియు ప్రతి ఫ్రెండ్కు రూ.150 వరకు అదనపు ఆఫర్లను, మిత్రులు ఇఓఆర్ఓఎస్ పేజీకి భేటీ అయితే చాలు దేన్నీ కొనుగోలు చేయకపోయినా ఆఫర్ ఇస్తుంది. చెల్లింపుకు సంబంధించినట్లు ఐసిఐసిఐ వంటి బ్యాంకుల నుంచి ఆకర్షణీయమైన ఆఫర్లు ఉండగా, క్రెడిట్ మరియు డెబిట్ కార్డులు రెండింటిలోనూ ఆకర్షణీయమైన 10% తగ్గింపు ఇస్తుంది. యాక్సిస్ బ్యాంకు 10% తగ్గింపును క్రెడిట్ కార్డులపై అందిస్తుంది, పేటీఎం వినియోగదారులు వ్యాలెట్ లావాదేవీలపై రూ.150 తగ్గింపు అందుకుంటారు.
ఈ ఇఓఆర్ఎస్లో నిరీక్షించదగిన ప్రముఖ విభాగాలు
ఈ కార్యక్రమం 15వ ఎడిషన్కు పర్సనల్ కేర్, యాక్ససరీస్, కిడ్స్, స్పోర్ట్స్ అభివృద్ధి దృష్టితో ప్రముఖ విభాగాలు ఉండగా, వింటర్ వేర్, వింటర్ ఎసన్షియల్స్ సీజన్ దృష్టితో అత్యంత ముఖ్యమైనవిగా ఉండగా, వాటిని ప్రజాదరణ పొందిన బ్రాండ్ల సేకరణతో అందిస్తుండగా, తీక్షణమైన ధర, విలువ ఆఫర్లు ఉన్నాయి. కిడ్స్వర్ విభాగం ఇప్పటి వరకు 100% ఏడాది నుంచి ఏడాదికి వద్ధి చెందుతోంది. ఇఓఆర్ఎస్-15కు 350కు పైగా ఎక్కువ స్థానిక, అంతర్జాతీయ బ్రాండ్లు 1.1 లక్షలకు పైగా ఎక్కువ స్టైళ్లను ఆకర్షణీయమైన ధరల్లో ఈ కార్యక్రమంలో అందిస్తోంది.
బ్యూటీ, పర్సనల్ కేర్ వయలంలో మింత్ర ఏడాది నుంచి ఏడాదికి 2.5 రెట్లు ప్రగతి నమోదు చేసుకుంది. 750 బ్రాండ్ల నుంచి ఈ ఈఓఆర్ఎస్ అవధిలో 38,000 స్టైళ్లను అందించనుంది. మింత్ర 50కు పైగా ఎక్కువ బ్రాండ్లను చేర్చనుండగా, అందులో డర్మాలాజికా, అనేస్టేసియా బెవర్లిహిల్స్, డబ్ల్యూ బ్యూటీ మరియు పిలిగ్రిమ్ ఈ కార్యక్రమం నేపథ్యంలో కొత్తగా చేరాయి. వౌవ్ స్కిన్ సైన్స్, మామా ఎర్త్ బోగోస్ ఆఫర్ అందిస్తుండగా, మ్యాక్, కామా ఆయుర్వేద మరియు ఫారెస్ట్ ఎసెన్షియల్స్ కొనుగోలుతో ఆకర్షణీయమైన ఉచిత ఆఫర్లను అందిస్తోంది.
ఇఓఆర్ఎస్ గురించి మింత్రా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శరణ్ పైస్ మాట్లాడుతూ, ‘‘ఇఓఆర్ఓఎస్ దేశంలో అత్యంత నిరీక్షిస్తున్న ఫ్యాషన్ కార్నివాల్గా ఉంది. మేము వివిధ విభాగాల్లో మా వినియోగదారులకు అత్యుత్తమ కలెక్షన్స్ను అందించేందుకు సిద్ధమయ్యాము. ఇప్పటి వరకు 14 ఎడిషన్లతో మేము ఫ్యాషన్ ప్రజ్ఞతో కొనుగోలుదారుల హృదయ స్పందనను అర్థం చేసుకోవడంలో సుదీర్ఘ ప్రయాణాన్ని చేశాము. అది మాకు ప్రతి వినియోగదారునికీ అత్యుత్తమమైన దాన్ని రూపొందించేందుకు మాకు అవకాశాన్ని ఇచ్చింది. మేము గమనార్హమైన సంఖ్యలో కొత్త వినియోగదారులను మా సామాజిక కామర్స్ ప్లాట్ఫారాల ద్వారా, ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఎం-లైవ్ ద్వారా వారి ప్రస్తుత, సౌందర్య అవసరాలను పరిష్కరించేలా నిరీక్షిస్తున్నాము. మా 25,000 కిరాణా భాగస్వాములు మా వినియోగదారులకు ఈఓఆర్ఎస్ అనుభవాన్ని వృద్ధి చేయడంలో కీలక పాత్రను పోషించనున్నారు. అంతే కాకుండా ప్రత్నామ్నాయ ఆదాయ మూలాన్ని కనుగొంటారు’’ అని వివరించారు.
ఇఓఆర్ఎస్-15లో ఏ బ్రాండ్లను నిరీక్షించాలి
మహమ్మారి సమయంలో మింత్ర వ్యాపారంలో అగ్రగామిగా ఉండగా, పెద్ద, చిన్న విక్రేతలకు కావలసిన పునాదిని నిర్మించి, వారి వినియోగదారులను అత్యంత కఠిన సమయంలో అందులోనూ ముఖ్యంగా మహమ్మారి 2వ అల సమయంలో క్రియాశీలకంగా ఉండేందుకు మద్ధతుగా నిలిచింది. దీనితో వేలాది మంది కళాకారులు, చేనేతలు లాక్డౌన్ సందర్భంలో మింత్రా కార్యక్రమాలతో క్రమబద్ధమైన విక్రయాలతో అనుకూలతను పొందగా, విక్రయాలే కాకుండా ఇతర విధాలుగా ప్రయోజనాన్ని అందుకున్నారు. ఈ అన్ని కార్యక్రమాలు మింత్ర బ్రాండ్ రాయబారుల్లో విశ్వాసం, నమ్మకాన్ని వృద్ధి చేయగా, వారు ఇప్పుడు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు అవసరమైన విస్తరణను అందిస్తుంది.
ఇఓఆర్ఎస్-15లో బోట్ సీఈఓ వివేక్ గంభీర్ ఈ బ్రాండ్ వాటాదారుల ఉత్సాహానికి ప్రాతినిధ్యం వహించి మాట్లాడుతూ, ‘‘మింత్రతో రానన్న ఇఓఆర్ఎస్ టైటిల్ భాగస్వామి అయ్యేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాము, అది దేశంలోని అత్యంత పెద్ద ఫ్యాషన్ కార్నివాల్లలో ఒకటిగా ఉంది. మింత్ర, బోట్ రెండూ సర్వోన్నతమైన ఫ్యాషన్-ఫార్వర్డ్ బ్రాండ్లలో ఒకటిగా గుర్తింపు పొందాయి. భారతదేశంలో స్టైల్ కోషెంట్ను ఉన్నతీకరించేందుకు శక్తిని కలిగి ఉన్నాము. మేము మింత్రాతో దీర్ఘకాలిక బాంధవ్యాన్ని కలిగి ఉన్నాము ఎందుకంటే వారు ఆడియో యాక్ససరీస్, స్మార్ట్ వాచెస్కు సంబంధించినట్లు వినియోగదారుల అభిప్రాయాలను రూపొందించడంలో ప్రముఖ పాత్రను పోషించారు. ఈ భాగస్వామ్యం పండుగ కొనుగోలు ఆనందాన్ని సంబరం చేసుకునే లక్ష్యాన్ని కలిగి ఉంది. జీవనశైలి బ్రాండ్లను కొత్త, వృద్ధి చెందుతున్న ఫ్యాషన్ ప్రజ్ఞ కలిగిన ప్రజలకు పరిచయం చేస్తుంది’’ అని వివరించారు. మింత్ర తన ప్లాట్ఫారంలో 90కు పైగా సరికొత్త బ్రాండ్లను విడుదల చేసింది, అందులో ప్రముఖ పేర్లయిన మిస్గైడెడ్, జస్టిస్, డిఫ్యాక్టో, ఫైర్-బోల్ట్, అనేస్టేసియా బెవర్లీ హిల్స్, స్విస్ బ్యూటీ, పిలిగ్రిమ్ తదితరాలు ఉన్నాయి.
వినియోగదారుల క్రియాశీలత, మార్కెటింగ్ చర్యలు
ఈ సీజన్ కోసం మింత్ర అన్ని రకాల మార్కెటింగ్ క్యాంపెయిన్లను డిజైన్ చేసి, ప్రారంభించగా ఇది పూర్తి కార్యక్రమంలో ఘనమైన విక్రయాల ప్రస్థావనను తీసుకు వచ్చి వినియోగదారులకు ఏ కారణంతో అయినా కొనుగోలు చేయడాన్ని ఉత్తేజిస్తుంది. ఇందులో 120కుపైగా ఎక్కువ హై ఇంప్యాక్ట్ ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు ఈ కార్యక్రమం గురించి జాగృతి కల్పించనున్నారు. ఇఓఆర్ఎస్ టివిసి క్యాంపెయిన్లో హృతిక్, దుల్కర్, సింబు, కియారా, దిశ, సమంతా ఉండగా, కార్యక్రమం విభాగాలకు అనుగుణంగా కమ్యూనికేషన్ చేయనున్నారు.