Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వాణిజ్య బ్యాంక్ల తరహాలోనే తాము కూడా ఉచిత లావాదేవీలకు పరిమితి విధిస్తున్నట్లు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) వెల్లడించింది. ఈ సంస్థ ఇప్పటి వరకు నగదు ఉపసంహరణ, డిపాజిట్లలో అపరిమిత ఉచిత లావాదేవీలను అందిస్తుంది. కొత్త ఏడాది జనవరి నుంచి బ్యాంకు అందించే ఉచిత లావాదేవీల పరిమితి మించితే ప్రత్యేకమైన చార్జీలు వసూలు చేయనున్నట్లు వెల్లడించింది. తమ బేసిక్ ఖాతాదారులకు ప్రతి నెల ఉచితంగా 4 లావాదేవీలు అందించనున్నట్టు పేర్కొంది. ఆ తర్వాత ప్రతీ నగదు ఉపసంహరణ లావాదేవీలోని విలువలో 0.50 శాతం లేదా కనీసం రూ.25 చార్జీల రూపంలో వసూలు చేయనున్నట్టు స్పష్టం చేసింది.