Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఈ ఏడాది థీమ్ 'బిల్డ్ విత్ స్పీడ్`
ముంబై : గ్రే సిమెంట్, వైట్ సిమెంట్, రెడీ మిక్స్ కాంక్రటీట్ కు సంబంధించి భారత దేశ అతిపెద్ద తయారీ సంస్థ అయిన అల్ట్రాటెక్ ఇండియా తన ఇండియా నెక్ట్స్ 5వ ఎడిషన్ కు పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా ప్రముఖ ఆర్కిటెక్ట్ లు, నిపుణులు, ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ రంగాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆహ్వానాలు పంపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఎంట్రీ కిట్స్, పోటీ వివరాలు http://www.ultratechindianext.com లో చూడవచ్చు.
ఈ ఏడాది ఇండియా నెక్ట్స్ ఇన్షియేటివ్ 'బిల్డ్ విత్ స్పీడ్`. దేశానికి చెందిన ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్ లు, డిజైన ర్లు ఒక ప్రాజెక్టును ఎంచుకునేందుకు పోటీ పడుతారు. అది పట్టణ లేదా గ్రామీణ నేపథ్యంతో వినూత్నతతో కూడుకున్నదై, ప్రజలపై ప్రభావం కలిగించేదిగా, భారత్ తన సుస్థిరదాయక అభివృద్ధి ఆశయాలు (ఎస్డీజీ) ను సాధించేందుకు తోడ్పడేదిగా ఉండాలి. అధునాతన సాంకేతికతలు, ప్రక్రియలు, మెటీరియల్స్ తో ఇంటి నమూనాలను అభివృద్ధి చేయడం 'బిల్డ్ వి త్ స్పీడ్` ఆశయం. అది భారతదేశ వృద్ధి గాధను పునర్లిఖించేదిగా ఉండాలి. దేశ గృహనిర్మాణ అభివృద్ధి ప్రాథమ్యాలను నిర్దేశిత కాలవ్యవధిలో నెరవేర్చేదిగా, దానికి సంబంధించిన సవాళ్లను ఎదుర్కొనేదిగా ఉండాలి.
ఇందులో పాల్గొనే వారు పట్టణ నేపథ్యాన్ని ఎంచుకుంటే వారు వలస కార్మికుల లేదా మురికివాడల్లోని ప్ర జల పునరావాసం అభివృద్ధి పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. గ్రామీణ నేపథ్యాన్ని ఎంచుకునే వారు నిరాశ్ర యులు లేదా వలస కార్మికుల కోసం ఉద్దేశించిన హౌసింగ్ పరిష్కారాలను వృద్ధి చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. గ్రామీణ నేపథ్యంపై వచ్చే ఎంట్రీలు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ఉ గ్రామీణ్ (పీఎంఏవై ఉజి) వంటి ప్రభుత్వ పథకాలకు లబ్ధి చేకూర్చేలా సామూహిక తక్కువ వ్యయ ఇంటి నిర్మాణాలపై కూడా దృష్టి సారించవచ్చు.
ఈ ఏడాది ఎంట్రీలన్నీ కూడా ఆన్ లైన్ లోనే ఆమోదించడమవుతుంది. విస్తృత శ్రేణికి చెందిన పరామితులతో నిపుణుల కమిటీచే మదింపు చేస్తారు. వేగవంతమైన నిర్మాణం, సృజనాత్మకత, వినూత్నత, ప్రాజెక్ట్ మన్నే కా లం, ఉపయోగించిన సాంకేతికత, మెటీరియల్స్, భారీ స్థాయి అమలు, అది కలిగించే ప్రభావం లాంటివి వీటిలో ఉం టాయి.
ఎంట్రీల దాఖలుకు చివరి తేదీ: 31 జనవరి, 2022
2015 లో ఆరంభమైన నాటి నుంచి కూడా ఇండియా నెక్ట్స్ గత నాలుగు ఎడిషన్లలో సుమారు 10 వేల మందికి పైగా పార్టిసిపెంట్స్ ను ఆకట్టుకుంది. అల్ట్రాటెక్ చేపట్టిన ఈ ఇన్షియేటివ్, దేశాభివృద్ధికి అత్యంత ముఖ్యమైన సమస్యల పరిష్కారాలకు గాను ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్ లలో వినూత్న ఆలోచనలు రేకెత్తించడం ద్వారా యువ ప్రతిభను ప్రోత్సహించడం లక్ష్యంగా చేపట్టబడింది. గత ఎడిషన్లలో ఇండియా నెక్ట్స్ పలు కీలక అంశాలపై దృష్టి సారించింది. స్మార్ట్ సిటీ ప్లానింగ్, స్కిల్ డెవలప్ మెంట్, సామర్థ్యపూరిత చలనశీలత - ప్రజారవాణ, నీళ్లు, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, విలేజ్ క మ్యూనిటీ డిజైన్, వేగంగా పెరిగిపోతున్న జనాభాకు ఇళ్ళ నిర్మాణం వంటి అంశాలు వీటిలో ఉన్నాయి.
ఇండియా నెక్ట్స్ అనేది ఒక కొలాబ్రేటివ్, ఫార్వర్డ్ థింకింగ్ వేదిక. ప్రాక్టీసింగ్ ఇంజినీర్ల, ఆర్కిటెక్ట్ లతో పాటుగా ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ రంగాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థుల ఆలోచనలు, నైపుణ్యాలతో దేశం ఎదుర్కొంటున్న అతి గొప్ప మౌలిక వసతుల సవాళ్లకు పరిష్కారాలను ఇది వెలుగులోకి తీసుకువస్తుంది.
గ్రామీణ నేపథ్యం కింద వచ్చే డిజైన్లు ఆ ప్రాంతపు స్థితిగతులను దృష్టిలో ఉంచుకునే ఉండాలి. ముమ్మర మౌలిక వసతులు, సామాజిక స్థలాలు, చిన్నపాటి వసతులు లాంటివన్నీ సమర్పించిన ప్రతిపాదనల్లో భాగంగా ఉండాలి.
పట్టణ నేపథ్యం కింద వచ్చే వాటిల్లో పరిష్కారాలు తప్పనిసరిగా ఎస్డీజీలలో అనుగుణంగా ఎంచుకున్న రా ష్ట్రాలకు సంబంధించినవై ఉండాలి. పాల్గొనే వారు తమ ప్రతిపాదనల్లో ఒకనిర్దిష్ట ఎస్డీజీని అనుగుణంగా కార ణాలను తెలియజేయడాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది.