Authorization
Mon Jan 19, 2015 06:51 pm
4 మిలియన్ల మంది ప్రజలను చేరుకునేందుకు ప్రచారం
110 నగరాలు, 300 పట్టణాలు తిరగనుంది
సికింద్రాబాద్ : మునిచ్లో ప్రధాన కార్యాలయం కలిగి, సమగ్రమైన రివర్స్ లాజిస్టిక్స్ పరిష్కారాలను అందించడంలో అంతర్జాతీయంగా అగ్రగామిగా వెలుగొందుతున్న రివర్స్ లాజిస్టిక్స్ గ్రూప్ (ఆర్ఎల్జీ), తమ క్లీన్ టు గ్రీన్ ఆన్ వీల్స్ కార్యక్రమం ప్రారంభించింది. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు. కంపెనీ ప్రతిష్టాత్మక ప్రచారం క్లీన్ టు గ్రీన్ (సీ2జీ)కు తాజా రూపు ఇది. ఈ తాజా అవగాహన మరియు సేకరణ కార్యక్రమం 110 నగరాలు, 300 పట్టణాలలో జరుగనుండటంతో పాటుగా దేశవ్యాప్తంగా 40 లక్షల మంది ప్రజలను చేరుకోనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 9 కలెక్షన్ వాహనాలు పలు నగరాలు, పట్టణాలలో తిరగడంతో పాటుగా 5500 మెట్రిక్ టన్నుల ఈ-వ్యర్థాలను సేకరించనున్నాయి. దీనితో పాటుగా పాఠశాలలు, కార్పోరేట్ సంస్ధలు, బల్క్ వినియోగదారులు, రిటైలర్లు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల నడుమ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా ఆరోగ్య శిబిరాలనూ ఏర్పాటుచేయనున్నారు.
ఈ ప్రచారం దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఉత్తరాన న్యూఢిల్లీ, జమ్మూ, తూర్పున కోల్కతా, గౌహతి, రాంచి, పశ్చిమాన అహ్మదాబాద్ మరియు దక్షిణాన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లలో జరుగనుంది. ఈ కలెక్షన్వాహనాలతో పాటుగా ఉన్న సిబ్బంది ఈ-వ్యర్ధాలను వినియోగదారుల నుంచి సేకరిస్తారు.
కంపెనీ తాజా అవగాహన, కలెక్షన్ వ్యూహాలను గురించి ఆర్ఎల్జీ ఇండియా, మేనేజింగ్ డైరెక్టర్, రాధికా కాలియా మాట్లాడుతూ'మహమ్మారి పలు పరిశ్రమల వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపినప్పటికీ , ఆర్ఎల్జీ వద్ద మేము స్థిరంగా ఈ-వ్యర్ధ అవగాహన కార్యక్రమాన్ని ప్రజల నడుమ నిర్వహించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాం. క్లీన్ టు గ్రీన్ ఆన్ వీల్స్ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటుగా తగిన రీతిలో ఈ-వ్యర్ధాలను నాశనం చేయడం, రోజువారీ జీవితంలో రీసైక్లింగ్ సాంకేతికతలను వినియోగించడాన్ని ప్రోత్సహించడం చేస్తున్నాం` అని అన్నారు.
ఈ క్లీన్ టు గ్రీన్ ఆన్ వీల్స్ ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్, వెస్ట్ మారేడ్పల్లి, అరుణ్ నగర్ రోడ్ వద్ద విజయవంతంగా ఈ-వ్యర్థ సేకరణ చేయడంతో పాటుగా అవగాహన కార్యక్రమాలను సైతం నిర్వహించారు.