Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బ్యాంక్ ఖాతాదారులు తమ కేవైసీ నమోదుకు గడువును పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ ఆందోళనల నేపథ్యంలో 2022 మార్చి 31 వరకు కేవైసీ ఆప్డేట్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. గతంలో ఈ గడువు 2021 డిసెంబర్ 31 వరకు ఉండేది. కేవైసీ ప్రక్రియలో భాగంగా ఖాతాదారులు బ్యాంకులకు తమ గుర్తింపు, చిరునామా పత్రాలను బ్యాంక్లకు సమర్పించాల్సి ఉంటుంది. సాధారణ ఖాతాదారులు ప్రతి పదేళ్లకు ఒకసారి కేవైసీని సమర్పించాల్సి ఉండగా.. ఎక్కువ రిస్క్ ఉన్న ఖాతాదారులు ప్రతి రెండేళ్లకు ఒకసారి కెవైసిని నమోదు చేయాల్సి ఉంటుంది. ఆయా ఖాతాదారుల ఆర్థిక లావాదేవీలను బట్టి బ్యాంక్లు కేవైసీని కోరుతుంటాయి.