Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : దేశంలో రెండో అతిపెద్ద కంపెనీ ఇన్ఫోసిస్ 2021 డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 11.8 శాతం వృద్థితో రూ.5,809 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.5,197 కోట్ల లాభాలు ఆర్జించింది. ఇదే సమయంలో రూ.25,927 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన క్యూ3లో 23 శాతం పెరిగి రూ.31,867 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రెవెన్యూ వృద్థి 19.5 శాతం - 20 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేసింది. బుధవారం బిఎస్ఇలో ఇన్ఫోసిస్ షేర్ 1.1 శాతం పెరిగి రూ.1,877.60 వద్ద ముగిసింది.