Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వైద్య నిర్ధారణ పరీక్షల సేవా సంస్థల్లో ఒక్కటైనా మెడాల్ దక్షిణాదిలో భారీ విస్తరణపై దృష్టి కేంద్రీకరించినట్టు ప్రకటించింది. తమిళనాడులో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో తమ కార్యకలాపాలను పెంచనున్నట్లు తెలిపింది. అదే విధంగా కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కేరళలలో కూడా విస్తరణ ప్రణాళికలు రూపొందించినట్టు వెల్లడించింది. వీటిలో మినీ వెల్నెస్ కేంద్రాలు, ఫుల్ సర్వీస్ కేంద్రాలు, ల్యాబ్ కలెక్షన్ కేంద్రాలు, మెడాల్ కేర్ కేంద్రాలు ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుత ఏడాదిలో దక్షిణాదిలో 300-400 కేంద్రాలను ఏర్పాటు చేసే పనిలో ఉన్నామని మెడాల్ సీఈఓ అర్జున్ అనంత్ తెలిపారు.