Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టెక్నలాజీ దిగ్గజం షార్ప్ బిజినెస్ సిస్టమ్ (ఇండియా) ముద్రణలో మెరుగైన అనుభవం కోసం కొత్త మల్టీ పంక్షనల్ ప్రింటర్ సిరీస్లను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. మెరుగైన ఉత్పాదకత విధులు, భద్రతా మెరుగుదలలు, శక్తివంతమైన వర్క్ఫ్లో ఫీచర్లు, ఏకీకత వినియోగదారు ఇంటర్ఫేస్ను కలిగిన కొత్త ఎంపిపి సిరీస్లో నాలుగు కొత్త మోడళ్లను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. ఇందులో బిపి-20ఎం31టి, బిపి-20ఎం28టి, బిపి-20ఎం24టి, బిపి-20ఎం22టి వేరియంట్లు ఉన్నాయని పేర్కొంది. వీటి ధరలు రూ.1,32,500 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది.