Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థలో స్తబ్దత కొనసాగుతోంది. ప్రస్తుత ఏడాది జనవరిలో వాహన అమ్మకాలు పడిపోవడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుత ఏడాది జనవరిలో ప్యాసింజర్ వాహన విక్రయాలు 10 శాతం పడిపోయి 2,58,329 యూనిట్లకు పరిమితమయ్యాయని ఆటోమొబైల్స్ డీలర్స్ బాడీ ఎఫ్ఎడిఎ వెల్లడించింది. 2021 ఇదే మాసంలో 2,87,424 యూనిట్ల అమ్మకాలు జరిగాయని తెలిపింది. ఇదే సమయంలో 11,75,832 యూనిట్ల ద్విచక్ర వామన అమ్మకాలు జరగ్గా.. క్రితం జనవరిలో 13.44 శాతం క్షీణించి 10,17,785 యూనిట్లుగా నమోదయ్యాయి.