Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రయివేటు రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డునకు సంబంధించిన వివిధ సేవల ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కొత్త చార్జీలు ఫిబ్రవరి 10వ తేది నుంచి అమల్లోకి వచ్చాయని తెలిపింది. క్రెడిట్ కార్డు ద్వారా ఏటీఎం కేంద్రాల నుంచి నగదు తీసినా, ఆలస్యంగా బిల్లులు చెల్లించినా, నగదు అడ్వాన్స్ లావాదేవీలపై ఇకపై అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. చెక్ రిటర్న్ అయినా, ఆటో డెబిట్ ఫెయిల్ అయినా బిల్లు మొత్తంలో 2 శాతం ఇకపై వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఈ లావాదేవీలపై ఇక కనీసం రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. రూ.100 పైన - రూ.50వేల వరకు బకాయిలపై కనీసం రూ.100 చార్జ్ నుంచి గరిష్టంగా రూ.1200 వరకు చార్జ్ చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది.