Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అమ్మకాల ఒత్తిడితో మదుపర్ల సంపద దాదాపుగా రూ.4 లక్షల కోట్లు ఆవిరైంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు క్రమంలో ఎఫ్ఐఐలు తరలిపోవడం, భారత ఆర్థిక వ్యవస్థలో సానుకూల సంకేతాలు కానరాకపోవడం తదితర అంశాల మధ్య వారాంతంలో స్టాక్ మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. శుక్రవారం బీఎస్ఈ సెన్సెక్స్ 773.11 పాయింట్లు లేదా 1.31 శాతం కోల్పోయి 58,155కు పడిపోయింది. ఇంట్రాడేలో ఏకంగా 1,012 పాయింట్లు పతనమై 57,914 కనిష్ట స్థాయికి క్షీణించింది. బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.91 లక్షల కోట్లు పతనమై రూ.2,63,89,886 కోట్లకు పడిపోయింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1.90 శాతం వరకు నష్టపోయాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 231 పాయింట్లు కోల్పోయి 17,375 వద్ద ముగిసింది.