Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గడిచిన ఏడాది 2021లో భారత్లోని 1000 నగరాలకు 26 కోట్ల ఉత్పత్తులను రవాణ చేసినట్లు బి2బి ఇ-కామర్స్ వేదిక ఉడాన్ వెల్లడించింది. ఇదే సమయంలో 625 మంది రూ.1 కోటి పైగా అమ్మకాల మార్క్ను సాధించారని పేర్కొంది. గతేడాది కొత్తగా ఐదు లక్షలకు పైగా రిటైలర్లు లేదా కిరాణా షాప యజమానులు చేరారని ఉడాన్ సిఇఒ వైభవ్ గుప్తా తెలిపారు. తమ వ్యాపార భాగస్వాములకు ధరల పరంగా అధిక ప్రయోజనాలు, సులభంగా వ్యాపారం నిర్వహించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు.