Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ తిరుపతి: దేశవ్యాప్తంగా కారు కొనుగోలు అనుభూతిని పునర్ నిర్వచించేందుకు తనకు గల కట్టుబాటును చాటిచెబుతూ ఎంజీ మోటార్ ఇండియా నేడిక్కడ ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో తన నూతన విక్రయ కేంద్రాన్ని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రీమియం ఎస్ యూవీలకు గల పటిష్ఠ మార్కెట్ శక్తిసామర్థ్యాలను గుర్తిస్తూ, ఈ నూతన కేంద్రం నగరంలోని మరింత మంది కొనుగోలుదారుల ప్రయాణ అవసరాలను తీర్చనుంది. ఈ నూతన షో రూమ్ కొనుగోలుదారులకు లుక్ అండ్ ఫీల్ ను అందించడమే గాకుండా సంస్థ బ్రిటిష్ వారసత్వాన్ని కూడా ప్రతిబింబించనుంది. నూతన షోరూమ్ ప్రారంభంతో ఈ కార్ల తయారీ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో 12 టచ్ పాయింట్లను నిర్వహిస్తున్న ట్లయింది. 2022 చివరి నాటికి ఆంధ్రప్రదేశ్ లో వీటి సంఖ్యను 18కి పెంచాలని కూడా సంస్థ యోచిస్తోంది. ఈ బ్రాండ్ భారతదేశవ్యాప్తంగా 307 టచ్ పాయింట్స్ ను కలిగిఉంది.
ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ఎంజీ మోటార్ ఇండియా డీలర్ డెవలప్ మెంట్ డైరెక్టర్ పంకజ్ పార్కర్ మాట్లాడుతూ, ‘‘ఆంధ్రప్రదేశ్ లో మా కొనుగోలుదారులకు చేరువలో ఉండేందుకు రిటైల్ ఉనికిని విస్తరించా లన్న మా ప్రణాళికలకు అనుగుణంగానే ఎంజీ తిరుపతి ప్రారంభించబడింది. ఇది ఇక్కడి కొనుగోలుదారుల విక్రయ, సర్వీస్, విడిభాగాలు, యాక్సెసరీస్ అవసరాలను తీరుస్తుంది’’ అని అన్నారు.
ఈ సందర్భంగా ఎంజీ తిరుపతి డీలర్ ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘అగ్రగామి, భవిష్యత్ సన్నద్ధక బ్రాండ్ గా, వినూత్నత, సాంకేతిక చోదిత ధోరణులతో ఎంజీ ఇప్పటికే భారతీయ వాహనరంగంలో సంచలనాలు సృష్టించింది. ఈ బ్రాండ్ తో అనుబంధం మాకెంతో ఆనందదాయకం. ఎంజీ పటిష్ఠ బ్రిటిష్ వారసత్వం, సాంకేతికతపై దృష్టితో మేం ప్రయోజనం పొందనున్నాం. నెల్లూరు లోని కొనుగోలుదారులకు విశిష్ట వాహన రిటైల్ అనుభూతిని అందించనున్నాం’’ అని అన్నారు.