Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : పెట్టుబడులు, స్టాక్ మార్కెట్ల రెగ్యులేటరీ సంస్థ సెబీ నూతన చైర్మెన్గా మాధవి పూరి బచ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న సెబీ చైర్మెన్ అజరు త్యాగి పదవీ కాలం సోమవారంతో ముగిసింది. ఆమె గతంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ హెడ్గా పని చేశారు. 2017 నుంచి 2021 మధ్య కాలంలో సెబీ పూర్తి స్థాయి సభ్యురాలుగా ఉన్నారు. సెబీకి ఓ మహిళ చైర్మెన్గా నియామకం కావడం ఇదే తొలిసారి. త్యాగీ 2017 మార్చి 1న మూడేండ్ల కాలానికి చైర్మెన్ బాధ్యతలు తీసుకోగా.. కరోనా నేపథ్యంలో 2020 ఫిబ్రవరిలో తొలుత ఆరు నెలలు, ఆ తర్వాత ఆగస్టులో మరో 18 నెలల పొడిగింపు ఇచ్చారు. త్యాగీ పదవీకాలం పూర్తి కానున్న నేపథ్యంలో 2021 అక్టోబర్ 28న నూతన చైర్మెన్ నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను అహ్వానించి.. పలువురిని ఇంటర్యూ చేసి తుదకు మాధవి పూరి తెలిపారు.