Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ వరంగల్: ఆకాష్+బైజూస్ విద్యార్థులు 440 మంది జాతీయ స్థాయిలో ఎన్టీఎస్ఈ 2021 స్కాలర్షిప్ కోసం అర్హత సాధించారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన స్కాలర్షిప్ పరీక్ష ఇది. వరంగల్ నుంచి ఆకాష్ విద్యార్థి కొంతం ప్రహర్ష్ పాటిల్ ఈ పరీక్షలో అర్హత సాధించడంతో పాటుగా ఎన్టీఎస్ఈ 2021 స్కాలర్షిప్ సాధించాడు. ఈ ఫలితాలను గురించి ఆకాష్ + బైజూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ చౌదరి మాట్లాడుతూ ‘‘ఈ సంవత్సర ఫలితాలు అసాధారణం. మా విద్యార్ధులు, ఉపాధ్యాయులు ఈ ఫీట్ సాధించడానికి తీవ్రంగా శ్రమించారు. ఎన్టీఎస్ఈ స్టేజ్ 2లో 440 మంది ఎంపికయ్యారు. ఇప్పటి వరకూ ఇది అత్యధికం. అందరికీ అభినందనలు’’ అని అన్నారు. ప్రతి సంవత్సరం దాదాపు 2వేల స్కాలర్షిప్లను ఎన్టీఎస్ఈ లో భాగంగా దేశవ్యాప్తంగా అందిస్తున్నారు. వీటిలో 15% ఎస్సీలకు, 7.5% ఎస్టీలు , 27%బీసీలకు 4% దివ్యాంగులకు కేటాయిస్తుంటారు.