Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబై: ఫోర్బ్స్ మార్షల్ కో-చైర్మన్, సీఐఐ మాజీ అధ్యక్షుడు, క్రియేటివ్ థింకర్ అ యిన నౌషద్ ఫోర్బ్స్ తన నూతన పుస్తకం ‘ది స్ట్రగుల్ అండ్ ప్రామిస్ : రిస్టోరింగ్ ఇండియాస్ పొటెన్షియల్’ ను ఆవిష్కరించారు. ప్రపంచ లీడర్ గల భారతదేశానికి గల శక్తిసామర్థ్యాల గురించి ఈ పుస్తకంలో ఆసక్తి దాయకంగా చర్చించారు. భారతదేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ మనం నిర్మించుకోదగ్గ విధంగా అది నిజంగా కొన్ని అద్బుత శక్తులను కలిగి ఉన్న ట్లుగా ఈ పుస్తకం వెల్లడిస్తుంది. వైవిధ్యభరిత సంస్కృతి, విజయసాధనపై దృష్టి పెట్టే యువ జనాభా, ప్రజాస్వామిక సంస్థలు, పటిష్ఠ, వైవిధ్యభరిత ప్రైవేటురంగం లాంటివి ఈ బలాల్లో ఉన్నాయి. ఇక్కడ ఉన్న ట్రిక్ అంతా కూడా పరిశ్రమ, సంస్థలు, విధానాల మధ్య సరైన సమతుల్యత సాధించడమే.
హార్పర్ కొలిన్స్ ప్రచురించిన ఈ నూతన పుస్తకంలో వాగ్దానం యొక్క శక్తి, సవాళ్లను పరిష్కరించడం ఎలా నో ప్రముఖంగా ప్రస్తావించారు. కొన్ని సాధ్యాసాధ్యాల గురించి ఆయన ప్రస్తావించారు. వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధించడం; వినూత్నతలో, డిజైన్, చదువు, పరిశోధనలో పెట్టుబడులు పెట్టడం; భారతదేశ వైవిధ్యభరిత సంస్కృతిని కాపాడుకోవడం భారతీయులందరి సామూహిక ఆశయంగా పేర్కొన్నారు.
2016-17 లో సీఐఐ ప్రెసిడెంట్ గా నౌషద్ దేశవ్యాప్తంగా పరిశ్రమతో, ప్రభుత్వాలతో, పలువురు ప్రపంచ నేతలతో సంభాషించే వారు. భారతదేశం అద్భుత శక్తులను కలిగిఉందని, తెలివిగా, సక్రమంగా వాటిని ఉప యోగించుకుంటే, అది ప్రపంచ నాయకురాలు కాగలదన్న ఆయన విశ్వాసాన్ని అది మరింత బలోపేతం చేసింది.
తన పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా నౌషద్ ఫోర్బ్స్ మాట్లాడుతూ, ‘‘ భారతదేశ భవిష్యత్ ను నేను ప్రగా ఢంగా విశ్వసిస్తాను, గొప్ప విజయాల సాధనలో దానికి గల శక్తిసామర్థ్యాలను. విజయాల కోరల నుంచి పరాజయాలను లాగేసేందుకు మనకు గల శక్తిసామర్థ్యాలను కూడా నేను ప్రశంసిస్తాను. వినూత్నత, చదువు, ప్రజారోగ్యం, ఉద్యోగాల నాణ్యతలో వెనుకబాటును పరిష్కరించే క్రమంలో ప్రభుత్వ పాత్రలోకి ప్రవేశించడంలో పోరాటం ఉంటుంది. ఇక వాగ్దానం అనేది మన వైవిధ్యభరిత సంస్కృతి నుంచి వస్తుంది. ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక దాన్ని అది కలిగిఉంది. యువ, ఆకాంక్షాపూరిత జనాభా, పటిష్ఠమైన ప్రైవేటురంగం మన వృద్ధి చోదకశక్తులు. భవిష్యత్ లో మనం ప్రపంచానికి నాయకత్వం వహిస్తాం అనే అంశాన్ని నేను నిజంగా విశ్వసిస్తున్నాను’’ అని అన్నారు.
ఈ పుస్తకం ఒక కల గురించి మాత్రమే కాదు, దాన్ని నిజం చేసుకునేందుకు ఒక స్పష్టమైన, ప్రాక్టికల్ వర్క్ ప్లాన్ గురించి కూడా మాట్లాడుతుంది. తన కల దేశంలోని వివిధ వర్గాలకు చెందిన వారిని... ఆలోచనా పరులు, విధాన నిర్ణేతలు, యువత, కార్పొరెట్ మేనేజర్లు, విద్యావేత్తలు....ఇలా మరెందరినో చేరుతుందని నౌషద్ ఆశిస్తారు. భారతదేశ వాగ్దానం నెరవేర్చేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తారు.
ఆ పుస్తకంలో నుంచి కొన్ని ఆలోచనలు:
1. పటిష్ఠమైన రూపాయి మానసికంగా మంచిదే కావచ్చు కానీ అది దిగుమతులను చౌకయినవిగా, ఎగుమతులను ఖరీదైనవిగా మారుస్తుంది. డాలర్ కు రూ.80 విలువ అనేది 2014 నాటి రూ పాయి విలువను పునరుద్ధరిస్తుంది. డాలర్ కు రూ.100 అనేది రక్షణాత్మక చర్యల అవసరం లే కుండా చేస్తుంది, ఎగుమతులకు దాన్ని మించిన ప్రోత్సాహకం మరొకటి ఉండదు.
2. జైపూర్ లో అంబర్ కోట వద్ద ఒక ఫోటోగ్రాఫర్ తో తాను చర్చించిన అంశాలను ప్రసిద్ధ ఆర్థికవేత్త గ్రే బెకర్ తరచూ చెబుతుంటారు. భారతీయుల ఆంత్రప్రెన్యూర్ షిప్ నైపుణ్యాలకు ఉదాహరణగా ఆ యన ఆ కథ చెబుతుంటారు. అవ్యవస్థీకృత రంగంలో పని చేసే ఓ వ్యక్తి ప్రోత్సాహకాలను ఆర్థిక శా స్త్రంలో నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి కన్నా బాగా అర్థం చేసుకోగలుగుతాడన్నది అందులో అం తరార్థం.
3. ఫ్రమ్ హెవెన్ లేక్ అనేది విక్రమ్ సేత్ స్వీయ జీవిత చరిత్ర పుస్తకం. 1980లలో చైనా వాయువ్య భాగంలోని ఓ చిన్న పట్టణానికి ఆయన వెళ్లడానికి సంబంధించి ఒక చక్కటి కథ ఉంది. అక్కడ ఆ యన పాటలు పాడే గుంపును చూస్తారు. 1950ల నాటి పాట పాడేందుకు ఆయన కూడా అం దులో చేరుతారు. అక్కడి వారికి ఆ పాట తెలుసు. ఆయన పాడుతుంటే మరెంతో మంది గొంతు కలుపుతారు. అది హిందీ పాట. భారతదేశ సాఫ్ట్ పవర్ ఎంటో అది చాటిచెబుతుంది. నాటి నుంచి కూడా అది పెరుగుతూనే ఉంది.
4. కొన్నేళ్ల క్రితం ఫోర్బ్స్ మార్షల్ ఒక నూతన కండెన్సేట్ పంప్ డిజైన్ కు జిమ్ ఆడమ్స్ సూత్రాలను క్రమబద్ధంగా వర్తింపజేశారు. ఆ ఇండస్ట్రియల్ పంప్ అందరినీ ఆకట్టుకునేదిగా ఉంది – ఎరుపు, న లుపు, వెండి రంగులతో. చూసేందుకు రాకెట్ లా ఉంది. సూరత్ లోని ఓ టెక్స్ టైల్ యజమాని అ ది ఓ డయింగ్ మెషిన్ పై ఉండడం చూశారు. ఆ ఉత్పాదన ఏంటో తెలుసుకోకుండానే, తన ప్లాంట్ లోని ఒక్కో మెషిన్ వద్ద దాన్ని ఉంచేందుకు ఆర్డర్ చేశారు. ఎక్కడైనా సరే – చక్కటి డిజైన్ కు ఎంతో విలువ ఉంటుంది.
5. భారతదేశంలో అత్యంత విలువైంది దాని నాలుగోవంతు 350 మిలియన్ల జనాభా. ఈ ప్రముఖ గ్రూపింగ్ సజాతీయమైంది కాదు. ఆసియా సంపన్న వ్యక్తి ముకేశ్ అంబానీ మొదలుకొని ఓ చిన్న దుకాణ యజమాని నుంచి ఓ మంచి కంపెనీలో ఇంజినీర్ దాకా ఈ పుస్తకాన్ని కొని చదివే వారెం దరో వీరిలో ఉన్నారు. మిగిలిన మూడొంతుల మంది అస్థిరదాయక ఉనికి కలిగి ఉండేవారు.
6. భారతదేశంలో నేడు 37 మిలియన్ల విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారు. ప్రపంచంలోని మూడు వంతుల దేశాల జనాభా కన్నా ఈ సంఖ్య అధికం.
7. మా కంపెనీలో సెక్యూరిటీ గార్డు ఒకరోజు మా వద్దకు వచ్చి, తన బిడ్డ డాక్టర్ అయిందని, తనకు మారుడు జీఈ లో ఇంజినీరుగా పని చేస్తున్నాడని ఎంతో గర్వంగా చెప్పాడు. ఒక్క ఏడాదిలో కు టుంబ ఆదాయం పది రెట్లు పెరిగింది. నెలకు రూ.1.5 లక్షలకు చేరుకుంది. వినియోగ శక్తిలో ఇ లాంటి పెరుగుదలలు మన వృద్ధి గాధను ముప్పైఏళ్లుగా ముందుకు తీసుకెళ్లాయి. ఈ సెక్యూరిటీ గార్డు మిగిలిన వారికి విభిన్నమేమీ కాదు. అలాంటి లక్షలాది మంది ఉన్నారు. అలా అని అతను అంత ప్రత్యేకం ఏమీ కాకుండా పోడు. ఆయనలా కాదల్చుకున్న వారు కోట్లాది మంది ఉన్నా, దాన్ని పునరావృతం చేయలేకపోతున్నారు.
8. సమస్యలను ఎదర్కొంటున్న వ్యవస్థల్లో సమర్థుడైన నాయకుడు గొప్ప మార్పు తీసుకురాగలగు తారు.1990లలో టి.ఎన్ శేషన్ భారత ఎలక్షన్ కమిషనర్ పాత్రను పునర్ నిర్వచించారు. ఎనాడో మర్చిపోయిన (ఇప్పుడు మళ్లీ మర్చిపోయిన) ప్రవర్తనా నియమావళి నిబంధనలను ఆయన అ మలు చేశారు. మతపరమైన విధానాలను నిలిపివేశారు. కోడ్ ఉల్లంఘించిన అభ్యర్థులపై నిషేధం విధించారు. ఆయన ఎన్నికల కమిషన్ ను శక్తివంతమైన, స్వతంత్ర వ్యవస్థగా చేశారు.
9. ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రానా ఓ పారిశ్రామికవేత్తను పతాకశీర్షికల్లోకి ఎక్కించాల్సిన అ వసరం లేదు. అది మన స్వతంత్ర ప్రైవేటు రంగం కోసమేనని గుర్తించాలి.
భారతదేశం నాయకత్వం వహించేందుకు – ఈ పుస్తకంలో నుంచి ఐదు భావనలు:
1. భారతదేశం ప్రపంచ లీడర్ కాగల శక్తిసామర్థ్యాలను కలిగిఉంది. మరే పెద్ద దేశం కూడా ఇం తలా చేకూర్పు, ఓపెన్ నెస్, కోలుకోవడం, ప్రైవేటు రంగ ప్రాధాన్యం లాంటివాటిని అందించలే దు. అది అంతర్జాతీయ నాయకత్వానికి దారి తీస్తుంది. మనం నాయకత్వ స్థానంలో లేని మా ట నిజమే అయినప్పటికీ, మనం ఎన్నో విశిష్టతలను కలిగిఉన్నాం. సంస్కృతి, వైవిధ్యభరిత, ఉజ్వల ప్రైవేటు పరిశ్రమ, విలక్షణ ప్రైవేటు, ప్రభుత్వరంగ సంస్థలు, భారీ స్థాయి, అంకితభావం కలిగిన ఎన్జీఓ రంగం, ప్రవర్తనకు సంబంధించి స్ఫూర్తిదాయక నిబంధనలు – ఇవన్నీ పటిష్ఠ పునాదిని వేస్తాయి.
2. అమలు చేసేందుకు భారత ప్రభుత్వానికి గల తక్కువ సామర్థ్యం ఎక్కడికక్కడ అంతరాలను వదిలేసింది. ఈ అంతరాలు మనకు అవకాశాలు. ఆ అంతరాలను పూడ్చాల్సి ఉంటుంది. పరిశ్రమ మాత్రమే విస్తృతస్థాయి మేనేజ్ మెంట్, అమలు సామర్థ్యాలను కలిగిఉంది.
3. పర్యావరణ సుస్థిరదాయకత, చూసేందుకు, పనితీరుకు, లైఫ్ సైకిల్ కు అన్నిటికీ డిజైన్ ఎంతో ముఖ్యమైంది. అయితే కొన్ని కంపెనీలు, కొన్ని ఉత్పాదనలు, సేవలు, పబ్లిక్ స్పేసెస్ మాత్ర మే చక్కటి డిజైన్ ప్రాక్టీస్ ను ప్రతిఫలిస్తాయి. దేశంలో కొంత మంది మాత్రమే చక్కటి డిజైన్ కా రణంగా మెరుగైన జీవితాలను గడుపగలుగతారు. వాల్యూ చెయిన్ లో పురోగతి సాధించేందు కు కంపెనీలకు డిజైన్ వీలు కల్పిస్తుంది. ప్రపంచానికి గొప్ప ఉత్పాదనలను అందిస్తుంది. గొప్ప ఉత్పాదనలనేవి చూసేందుకు అందంగా ఉంటూ, చక్కటి పనితీరును కలిగి, సరళంగా, అధిక నాణ్యతతో, ఎంతో మంది అందుకునేవిగా ఉంటాయి. గొప్ప డిజైన్ అందించేది వీటినే.
4. ఉన్నత విద్యారంగంలో భారతదేశానికి అపార అవకాశాలు ఉన్నాయి. అతి తక్కువగానే ప్రభు త్వ మద్దతుతో ఏటా పది లక్షల మంది ఇంజినీర్లను తయారు చేస్తోంది. మరెక్కడా ఇలాంటి వి జయం సాధ్యపడదు. మనం నాలుగు పనులు చేయాలి – యూనివర్సిటీలోకి ప్రభుత్వ నిధు లను మళ్లించడం ద్వారా అసలైన రీసెర్చ్ యూనివర్సిటీలను నిర్మించాలి. ప్రైవేట్ ప్రొఫెషనల్ ఎ డ్యుకేషన్ సిస్టమ్ లో నాణ్యతను మెరుగుపరిచేందుకు మరింతగా మార్కెట్ ను ఉపయోగిం చుకోవాలి. నిర్బంధ అసెస్ మెంట్ ను ప్రజలకు తెలియజేయాలి. తమ సొంత ఫీజులు నిర్ణయిం చుకునేందుకు విద్యాసంస్థలకు అవకాశం కల్పించడం ద్వారా, పారదర్శక విధానంలో వాటిని వసూలు చేసుకోవడం ద్వారా మెరిట్ ప్రాతిపదికన సమాన యాక్సెస్ కు వీలు కల్పించాలి. ఆ ఫీజులకు ప్రభుత్వ హామీతో రుణాలు లభ్యం కావాలి. భవిష్యత్ మేధావులను రూపొందించేలా కొన్ని అంతర్జాతీయ స్థాయి ఫుల్ – సర్వీస్ యూనివర్సిటీల నిర్మాణంపై దృష్టి పెట్టాలి.
5. భారతదేశం వంటి పెద్ద, వైవిధ్యభరిత దేశం పటిష్ఠ, స్వతంత్ర వ్యవస్థల అవసరాన్ని కలిగి ఉం టుంది. మన వంటి ప్రజాస్వామిక దేశంలో యూనివర్సిటీలు, ఎలక్షన్ కమిషన్లు, న్యాయస్థానా లు, స్వేచ్చా మీడియా, ప్రభావపూరిత విపక్షం, రాష్ట్రాలతో అధికారం పంచుకునే నిర్మాణం వంటి స్వతంత్ర వ్యవస్థల అడ్డుకట్టలు, సమతుల్యాలు ఉంటేనే ప్రగతి చోటు చేసుకుంటుంది. ప్రోత్సాహకాలను రక్షణాత్మక చర్యలతో సమతుల్యం చేసే స్వతంత్ర వ్యవస్థలు, సామాజిక బాధ్యతతో కూడిన ఆర్థిక స్వేచ్ఛ మనకు అవసరం. ప్రభుత్వం మాత్రమే ఆధారపడేది కానటువంటిది, లక్షలాది సంస్థలను విముక్తం చేసేటువంటిది మన ఆశయం కావాలి.