Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్థిక సంవత్సరం 21లో భారతీయ ఫాంటసీ స్పోర్ట్స్ ఇండిసీ ఆదాయం రూ.5,200 కోట్లుగా ఉంటుందని అంచనా
ఆర్థిక సంవత్సరం 2025 నాటికి ఈ రంగం నుంచి సంచిత పన్ను వాటా రూ.24,300 కోట్లుగా నిలుస్తుందని అంచనా
ఎఫ్ఎస్ వేదికల్లో 50% యూజర్ లావాదేవీలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచే జరుగుతున్నాయి
ఐపీఎల్ 2021, తొలి దశలో 20 లక్షలు పెరిగిన ఎఫ్ఎస్ యూజర్ల సంఖ్య
హైదరాబాద్ : ఫాంటసీ స్పోర్ట్స్కు(ఎఫ్ఎస్) భారతదేశంలో పరిశ్రమ ఏర్పాటు చేసుకున్న స్వీయ నియంత్రిత సంస్థ ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ (ఎఫ్ఐఎఫ్ఎస్), డెలాయిట్ సహకారంతో రూపొందించిన 'ఫాంటసీ స్పోర్ట్స్: క్రియేటింగ్ ఎ వర్చుయస్ సైకిల్ ఆఫ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్` అనే నివేదిక ఫలితాలను ఈ రోజు విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 13 కోట్లకు పైగా వినియోగదారులతో ప్రపంచంలోనే అతిపెద్ద ఫాంటసీ స్పోర్ట్స్ మార్కెట్గా భారత్ నిలుస్తోంది. రాబోయే సంవత్సరాల్లో ఇది 32% సీఎజీఆర్తో మరింత వృద్ధి చెందుతుందని అంచనా. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న అదికంగా ఉన్న సహస్రాబ్ది జనాభా, క్రీడలపై పెరుగుతున్న అనుబంధం, వేగంగా పెరుగుతున్న స్మార్ట్ఫోన్ విస్తృతి, తక్కువ-ధరకు మొబైల్ డేటా అందుబాటులో ఉండటం వంటి వాటి కారణంగా ఫాంటసీ స్పోర్ట్స్కు భారతదేశం అధిక-అభివృద్ధి, ఇన్-ఫోకస్ మార్కెట్గా నిలుస్తోంది. మార్కెట్ పరిమాణం ఆర్థిక సంవత్సరం 21లో రూ.34,600 కోట్ల నుంచి ఆర్థిక సంవత్సరం 20255 నాటికి రూ.1,65,000 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఫలితంగా సీఎజీఆర్ 38%కి చేరుకుంటుంది.
కబడ్డీ, హాకీ, ఫుట్బాల్, వాలీబాల్ వంటి ఇతర క్రీడలకు పెరుగుతున్న జనాదరణ కారణంగా ఫాంటసీ స్పోర్ట్స్ వేదికల్లో అగ్రగామి క్రీటగా నిలుస్తున్న క్రికెట్ వాటా క్షీణిస్తోంది. అయినప్పటికీ రాబోయే నాలుగేండ్లలో 30% సీఎజీఆర్తో వృద్ధిని కొనసాగించవచ్చని అంచనా. ఫాంటసీ స్పోర్ట్స్ పరిశ్రమలో అధిక ఆదాయాన్ని అందించే క్రీడగా క్రికెట్ కొనసాగుతుంది. మహిళల క్రికెట్ కూడా ఫాంటసీ క్రీడల్లో ప్రజాదరణ పొందిందిబీ 2020 ఐసీసీ మహిళల ట్వంటీ20 ప్రపంచ కప్ మొదటి 12 మ్యాచ్లు భారతదేశంలో 4.1 కోట్ల గంటల వీక్షణ గంటలు సృష్టించాయి. ఇది 2018తో పోల్చితే ఇది 213 శాతం పెరుగుదల. ఒక్క ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 ఎడిషన్ 1వ దశలోనే ఎఫ్ఎస్ పరిశ్రమ వినియోగదారులు భారతదేశంలో 20 లక్షల మంది వినియోగదారులు పెరిగారు.
కీలక ముఖ్యాంశాలు:
ఎఫ్ఎస్ వేదికల్లో 50% వినియోగదారు లావాదేవీలు ద్వితీయ, తృతీయ నగరాల నుంచే జరుగుతున్నాయి. ఇవి డిజిటల్ చెల్లింపు అక్షరాస్యతను ప్రోత్సహించడమే కాకుండా అట్టడుగు స్థాయి నుంచి క్రీడలలో నిమగ్నత, ప్రజా ప్రమేయాన్ని పెంచుతున్నాయి.
● ప్రస్తుతం భారతదేశంలో ఎఫ్ఎస్పీల కోసం నమోదిత వినియోగదారుల్లో దాదాపు 30% మంది మహిళా వినియోగదారులు ఉన్నారని అంచనా వేయబడింది, ఈ సంఖ్య రాబోయే కొన్ని సంవత్సరాలలో స్థిరంగా పెరుగుతుందని అంచనా.
● ప్రపంచవ్యాప్తంగా ఎఫ్ఎస్ యూజర్ బేస్ పురుషుల ఆధిపత్యంలో ఉంది. మొత్తం ఆదాయంలో పురుషుల వాటా 67% ఉంది. పురుష ఎఫ్ఎస్ వినియోగదారు విభాగం 2020ఉ26 నాటికి 14% జA+= వద్ద వృద్ధి చెందుతుందని అంచనా.
● ఆర్థిక సంవత్సరం 21లో రూ. 5,200 కోట్ల ఆదాయాన్ని సృష్టించడం ద్వారా విక్రేతలు, సేవా ప్రదాతల ద్వారా దాదాపు రూ.5,500 కోట్ల పరోక్ష ఆదాయ సృష్టి జరిగిందని మేము ఊహిస్తున్నాం. ఎఫ్ఎస్ (ప్రత్యక్ష + పరోక్ష)కి ఆపాదించబడిన మొత్తం రాబడి రూ. 10,700 కోట్లు. పరోక్ష ఆదాయంపై జీఎస్టీ ఉంటుందనే విషయాన్ని మనం గమనించవచ్చు
క్రీడా సంస్కృతిని పెంచుతున్న ఎఫ్ఎస్
'ఫాంటసీ స్పోర్ట్స్ పరిశ్రమ ఆర్థికపరంగా అనేక విధాలుగా భారతదేశపు మొత్తం వృద్ధి, అభివృద్ధిలో బహుళ మార్గాల్లో చొచ్చుకుపోతోంది - అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగాల సృష్టి, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) ఆకర్షించడం, ఖజానాకు గణనీయమైన ఆదాయాన్ని సమకూరుస్తుంది. అంతే కాకుండా ఇది క్రీడా సంస్కృతిని ప్రోత్సహిస్తోంది. ఫాంటసీ స్పోర్ట్స్ పోటీల్లో పాల్గొనేందుకు ప్రజలు జ్ఞానాన్ని మెరుగుపరుచుకోవడం వల్ల క్రికెటేతర క్రీడలకు ప్రోత్సాహం లభిస్తోంది. ఈ రంగం సామర్థ్యాన్ని గుర్తిస్తూ, అనుకూలంగా వచ్చిన కోర్టు తీర్పులతో పాటుగా ప్రభుత్వ ప్రాథమిక ఆలోచనా కేంద్రం నీతి ఆయోగ్ ఫాంటసీ స్పోర్ట్స్ కోసం సమగ్ర మార్గదర్శకాలు విడుదల చేసింది` అని తెలిపారు ఎఫ్ఐఎఫ్ఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), అన్వర్ షిర్పూర్వాలా.
'ఇటీవలి సానుకూల పరిణామాలు అంటే నైపుణ్య క్రీడలు నియంత్రించేందుకు రాజస్థాన్ ప్రభుత్వ ప్రకటన, ప్రతిభా క్రీడలను నిషేధించే చట్టాన్ని రద్దు చేస్తూ కర్ణాటక హైకోర్టు నిర్ణయం, ఎవీజీసీ (యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్) టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్ 2022లో ప్రకటన, గేమింగ్ రంగంలో అంతర్జాతీయ కేంద్రంగా ఎదిగే శక్తి భారత్కు ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన, ఈ పరిశ్రమ వృద్ధికి స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించేలా చేసింది. క్రీడలకు సంబంధించి మరో ప్రగతిశీల చర్యలో భాగంగా గుజరాత్ రాష్ట్రం తన క్రీడా విధానపు ముసాయిదాలో స్పోర్ట్స్ స్టార్టప్ల కోసం ఇంక్యుబేటర్ ఏర్పాటు చేస్తామని చెప్పడంతో పాటు క్రీడాకారుల సంక్షేమాన్ని ప్రకటించింది. ఇన్నాళ్లు అధికారిక తకరారులో పక్కకు జరిగిపోయిన క్రీడా పరిశ్రమ అభివృద్ధికి ఈ చర్యలు మరింత ఊతమిస్తాయి` అని ఆయన అన్నారు.
ఈ సముచిత రంగానికి పరిశ్రమ నుంచి ఏకైక స్వీయ-నియంత్రణ సంస్థగా ఎఫ్ఐఎఫ్ఎస్- ఈ పరిశ్రమ వృద్ధి బాటలో కొనసాగేలా చూసేందుకు, తన వినియోగదారులను రక్షించుకునేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయడానికి పూర్తిగా కట్టుబడి ఉందని అన్వర్ తెలిపారు. ఈ రంగం గురించి తన ఆలోచనలు పంచుకుంటూ, డెలాయిట్ ఇండియా భాగస్వామి ప్రశాంత్ రావు మాట్లాడుతూ, నిగత కొన్ని సంవత్సరాలుగా ఆన్లైన్ ఫాంటసీ స్పోర్ట్స్ అసమానమైన వృద్ధి సాధించి భారతీయ క్రీడా అభిమానుల నుంచి విస్తృతమైన ఆమోదాన్ని పొందాయి. స్థానికంగా అభివృద్ధి చేసిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా ఈ ఎదుగుతున్న రంగం ఇప్పుడు స్వావలంబన భారత్ అనే మాటకు స్వీయ విశ్వాసం, వృద్ధి దృష్టితో చిహ్నంగా నిలుస్తోంది. బాధ్యతాయుతమైన నియమ-ఆధారిత గేమింగ్ను ప్రోత్సహించడం ద్వారా భారతదేశంలో క్రీడా పరిశ్రమ అభివృద్ధికి సహకరించడం ద్వారా ఈ రంగం తన నిజమైన సామర్థ్యాన్ని వెలికి తీయడంలో ఎఫ్ఐఎఫ్ఎస్ సాయపడుతుందని నేను నమ్ముతున్నానుు అన్నారు.
ఫాంటసీ స్పోర్ట్స్ను భారతదేశపు డిజిటల్ ఎకానమీకి సూర్యోదయ రంగంగా నీతి ఆయోగ్ గుర్తించింది. ఈ పరిశ్రమ కోసం ఏకరీతి జాతీయ-స్థాయి నియంత్రణ ఫ్రేమ్వర్క్ సిఫార్సు చేసింది. ఎఫ్ఎస్లో నైపుణ్య ప్రాబల్యంపై విస్తృతంగా అందుబాటులో ఉన్న పరిశోధనలు, ఎఫ్ఎస్ ఫార్మాట్పై గౌరవ సుప్రీంకోర్టు, అనేక హైకోర్టుల కీలక తీర్పుల దృష్ట్యా సందిగ్థత, అనేక అధికారిక వ్యవస్థలకు ముగింపు పలుకుతూ పటిష్టమైన, ఏకీకృత జాతీయ-స్థాయి నియంత్రణా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తనిఖీలు, సమతుల్యతలతో కూడిన నిబంధనలు అదిక జవాబుదారీతనం, పారదర్శకతకు దారి తీసి వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరుస్తూ వినియోగదారు ఆసక్తికి రక్షణ కల్పిస్తాయి.