Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గృహౌపకరణాలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీదారు థాంప్సన్ ఇండియా కొత్తగా ఎయిర్ కండీషనర్ (ఏసీ) మార్కెట్లోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. కూల్ ప్రో మ్యాక్స్ సిరీస్లో నాలుగు మోడల్స్ను ఆవిష్కరించినట్లు వెల్లడించింది. స్థిరమైన వేగం, ఇన్వర్టర్ విభాగాలలో వన్ టన్, 1.5 టన్ రకాలలో ఇవి లభ్యమవుతాయని పేర్కొంది. వీటి ప్రారంభ ధరలను రూ.26,490గా నిర్ణయించింది. మార్చి 26 నుంచి ఈ ఉత్పత్తులు ఆన్లైన్లోనూ లభ్యమవుతాయని సూపర్ ప్లాస్ట్రానిక్స్ సీఈఓ అవ్నీత్ సింగ్ మార్వా పేర్కొన్నారు.