Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మల్టీ డిసిప్లీనరీ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లలో ఒకటైన మహీంద్రా యూనివర్శిటీ తమ మొట్టమొదటి ఫ్రాంకోఫోనీ డే ను జర్నీస్ డీ లా ఫ్రాంకోఫోనీ 2022 శీర్షికన 22 మార్చి నుంచి 24 మార్చి 2022 వరకూ నిర్వహించింది. ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని ఫ్రెంచ్ భాష మరియు సంస్కృతి యొక్క ఏకీకృత స్ఫూర్తిని జరుపుకోవడానికి నిర్వహించారు. దీనిని ప్రొఫెసర్ గెరార్డ్ క్రూజెట్ నేతృత్వంలోని డెలెగ్ జనరల్ డ్యు గ్రూప్ డెస్ ఎకోల్స్ సెంట్రల్ కు చెందిన సెంట్రల్ సుపెలెక్ యొక్క విజిటింగ్ లీడర్షిప్ బృందం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో మహీంద్రా యూనివర్శిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ యజ్ మెడ్యురీ తో పాటుగా హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ డీన్స్ మరియు హెడ్స్ పాల్గొన్నారు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 300 మిలియన్ల మంది ఫ్రెంచ్ మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో ఫ్రెంచ్ ఒకటి. ఈ కార్యక్రమం ఫ్రెంచ్ భాష మరియు సంస్కృతి ఏకీకృత స్ఫూర్తికి నిదర్శనం’’ అని డాక్టర్ యజ్ మెడ్యురీ, వైస్ ఛాన్స్లర్, మహీంద్రా యూనివర్శిటీ అన్నారు. ఈ మూడు రోజుల కార్యక్రమంలో ఆసక్తి కలిగిన విద్యార్థులు పోటీపడటంతో పాటుగా పోస్టర్ మేకింగ్ , కరవొకె , కవిత్య పఠనం, క్విజ్ పోటీలలో బహుమతులు గెలుచుకున్నారు. ఈ పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలతో ముగిశాయి.