Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థకు అద్దం పట్టే వాహన అమ్మకాల్లో పతనం కొనసాగుతోంది. ప్రస్తుత ఏడాది మార్చిలో దేశీయ ప్యాసింజర్ వాహన రిటైల్ అమ్మకాలు 4.87 శాతం పతనమై 2,71,358 యూనిట్లకు పరిమితమయ్యాయి. 2021 ఇదే మాసంలో 2,85,240 యూనిట్ల విక్రయాలు జరిగాయి. చిప్ల కొరత, చైనాలో లాక్డౌన్, రష్యా, ఉక్రెయిన్ పరిణామాలు వాహన డెలివరీలను ప్రభావితం చేస్తున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్ఎడిఎ) ప్రెసిడెంట్ వింకెష్ గులాటి పేర్కొన్నారు. గడిచిన మార్చిలో అన్ని కేటగిరీల వాహన అమ్మకాలు 2.87 శాతం తగ్గి 16,19,181 యూనిట్లుగా నమోదయ్యాయి. 2021 ఇదే నెలలో 16,66,996 యూనిట్లుగా చోటు చేసుకున్నాయి.