Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ పిఎన్బి తమ ఖాతాదారుల సేవింగ్ ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రూ.10 లక్షల లోపు నిల్వలపై ఇప్పటి వరకు 2.75 శాతం వడ్డీ రేటును అందించగా.. దీన్ని తాజాగా 2.70 శాతానికి కోత పెట్టింది. సవరించిన వడ్డీ రేట్లు ఏప్రిల్ 4 నుంచి అమల్లోకి వచ్చాయని పేర్కొంది. అదే విధంగా రూ.10 లక్షల నుంచి రూ.500 కోట్ల మధ్య నిల్వ ఉన్న సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటును ఏడాదికి 2.80 శాతం నుంచి 2.75 శాతానికి తగ్గించింది.