Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదిలో 9 శాతం ప్రియం
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి మరోసారి ధరలను పెంచాలని నిర్ణయించింది. ఇటీవల వరుసగా ముడి సరుకుల ధరలు పెరిగినందును ఆ భారాన్ని వినియోగదారులపై మోపనున్నట్టు స్పష్టం చేసింది. కొత్త ఏడాది జనవరిలోనే ధరలు పెంచిన ఈ కంపెనీ తాజాగా ఏప్రిల్లో మరోసారి పెంపునకు పచ్చజెండా ఊపింది. ఆ కంపెనీ ఉత్పత్తి చేసే అన్ని మోడళ్ల ధరలను సమీక్షస్తున్నట్టు బుధవారం రెగ్యూలేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చింది. 2021 జనవరి నుంచి 2022 మార్చి వరకు దాదాపుగా 8.8 శాతం ధరలను పెంచేసింది. గత ఏడాది కాలంగా వివిధ రకాల ముడి సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆ కంపెనీ ఇటీవల పేర్కొంది. హ్యాచ్బ్యాక్ ఆల్టో నుంచి ఎస్-క్రాస్ ఎస్యువి మోడల్ వరకు వివిధ శ్రేణుల కార్లను మారుతి సుజుకి తయారు చేస్తుంది.