Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాబోయే సంవత్సరాలలో సీఓఈల ద్వారా పరిశ్రమ మరియు విద్యారంగం నడుమ అంతరాలను పూరించనున్నట్లు వెల్లడి
హైదరాబాద్, 16 ఏప్రిల్ 2022 : ఎస్వీకెఎం యొక్క నర్సీ మాంజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (NMIMS) హైదరాబాద్ క్యాంపస్ తమ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ (ఎస్బీఎం) ఎంబీఏ మరియు పీజీడీఎం ప్రోగ్రామ్ల కోసం 11వ కన్వొకేషన్ డే 2022ను తమ జడ్చర్ల క్యాంపస్లో నిర్వహించింది. ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా జీఎంఆర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (జీఎంఆర్ఓస్బీ) సీఈఓ అశ్వని లోహానీ ; గౌరవ అతిథిగా గూంజ్ , గ్రామ్ స్వాభిమాన్ వ్యవస్ధాపక డైరెక్టర్ అన్షు గుప్తా పాల్గొన్నారు.
ఈ వేడుకలలో ఎస్వీకెఎం యొక్క ఎన్ఎంఐఎంఎస్ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ రమేష్ భట్ ; ఎస్వీకెఎం యొక్క ఎన్ఎంఐఎంఎస్ ప్రో వైస్ ఛాన్స్లర్ డాక్టర్ మీనా చింతమనేని ; ఎన్ఎంఐఎంఎస్ - హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ తపన్ పాండా ; ఎస్బీఎం, ఎన్ఎంఐఎంఎస్ ప్రోగ్రామ్ ఛైర్ డాక్టర్ జి.రాధాకృష్ణ మరియు ఎగ్జిక్యూటివ్ పీజీడీఎం, ఎన్ఎంఐఎంఎస్, హైదరాబాద్ క్యాంపస్ ఎగ్జిక్యూటివ్ చైర్ డాక్టర్ వైఎల్ఎన్ కుమార్ తో పాటుగా ఫ్యాకల్టీ, బోర్డ్ సభ్యులు, సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.
ఈ సంతోషకరమైన సందర్భంలో , ఈ సంవత్సరం ఈ క్యాంపస్లో రెసిడెన్షియల్ సదుపాయాలను ప్రారంభించారు. దీనితో పాటుగా సీటీఏఆర్ఏ (సెంట్రలైజ్డ్ ట్రైనింగ్ అకాడమీ ఫర్ రైల్వే ఎక్కౌంట్స్) మరియు రక్షణ మంత్రిత్వ శాఖ (ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్)తో అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది.
ఈ సంతోషకర సమయాన్ని వేడుక చేస్తూ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ రమేష్ భట్, విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేయగా, ప్రో వైస్ ఛాన్స్లర్ డాక్టర్ మీనా చింతమనేని ఈ ప్రక్రియను నిర్వహించారు.
ఈ కన్వొకేషన్ వేడుకలలో అవార్డులను అందజేసిన అనంతరం ఎస్వీకెఎం యొక్క ఎన్ఎంఐఎంఎస్ గౌరవనీయ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ రమేష్ భట్ మాట్లాడుతూ 'ఎన్ఎంఐఎంఎస్ యొక్క హైదరాబాద్ క్యాంపస్ , టీ హబ్తో బంధం కొనసాగిస్తుండటంతో పాటుగా విద్యార్ధులు, ఫ్యాకల్టీల నడుమ వ్యవస్థాపక ఆలోచనలను వృద్ధి చేస్తుంది. దీనితో పాటుగా సమగ్రమైన వృద్ధికీ తోడ్పడుతుంది. ఎన్ఎంఐఎంఎస్ యొక్క విశ్వసనీయత వినూత్నం. నూరుశాతం ప్లేస్మెంట్ రికార్డు కలిగిన సంస్ధలో సరాసరి జీతం 25% వృద్ధి చెందడం కనిపిస్తోంది. విజయవంతమైన విద్యార్ధులకు ఫైనల్ ప్లేస్మెంట్ కోసం ఈ సంవత్సరం 50కు పైగా నూతన కంపెనీలు జోడించబడ్డాయి. మా హైదరాబాద్ క్యాంపస్ ప్రాముఖ్యత గణనీయంగా వృద్ధి చెందడంతో పాటుగా మహమ్మారి సమయంలో కూడా 100% ప్లేస్మెంట్ కొనసాగించింది. ఎస్బీఎం మరియు ఇతర విద్యార్ధులకు ఇది గర్వకారణమైన క్షణం. మేము ఫ్యాకల్టీ వార్షిక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ క్యాలెండర్ను విడుదల చేశాము. ఇప్పుడు 10కు ప్రోగ్రామ్లను విజయవంతంగా నిర్వహించింది` అని అన్నారు.
డాక్టర్ రమేష్ భట్ మరింతగా మాట్లాడుతూ 'మా క్యాంపస్ అకడమిక్ ఫెసిలిటీని మరింతగా బలోపేతం చేసేందుకు మేము మా శక్తిని రెట్టింపు చేసుకోవడంలో భాగంగా పీహెచ్డీలు కలిగిన ఫ్యాకల్టీ సభ్యులను రిక్రూట్ చేసుకుంటున్నాం`అని అన్నారు. అదనంగా, ఎన్ఎంఐఎంఎస్ హైదరాబాద్ క్యాంపస్, ఇప్పుడు పరిశోధనా సంస్కృతిని ట్యూజ్డె టాక్ సిరీస్ ఆఫ్ రీసెర్చ్ ద్వారా నిర్మించబోతుంది. ఫ్యాకల్టీ దీనిని సమర్చించబోతుంది. తన కీలకోపన్యాసాన్ని జీఎంఆర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (జీఎంఆర్ఎస్బీ) సీఈఓ అశ్వని లోహానీ మాట్లాడుతూ 'నిష్కళంకమైన సమగ్రత, ప్రవర్తనను కొనసాగించండి, ఎందుకంటే, అది నిజంగా విలువైన జీవితాన్ని గడపటానికి పునాది వేస్తుంది. సానుకూల థృక్పధం మీరు ఊహించలేనటువంటి విజయాలకు దారి తీస్తుంది. జీవితపు మూల మంత్రం స్వీకరించండి, నిష్కంళకమైన సమగ్రత మరియు ప్రవర్తనను నిర్వహించండి. ధైర్యాన్ని పెంపొందించుకోవాలి, సంకల్ప శక్తిని నమ్మండి. దీనితో పాటుగా మానవ వనరుల యొక్క అసాధారణ సామర్థ్యం పట్ల నమ్మకం చూపండి. అభిరుచితో కలలు కనండి, మీ ప్రయత్నాలను ఆత్మసాక్షిగా చేయండి. మీ కలలు నెమ్మదిగా వాస్తవరూపం దాల్చడానికి సాక్షులుగా నిలవండి` అని అన్నారు.
ఎస్వీకెఎం ఎన్ఎంఐఎంఎస్ హైదరాబాద్ క్యాంపస్, విద్యార్థి కేంద్రీకృత విధానం అనుసరించడంతో పాటుగా విద్యార్ధుల నడుమ అత్యధిక సంతోష మంత్రం కోసం తగిన స్వేచ్ఛనూ అందిస్తుంది. ఎస్బీఎం వద్ద ఫ్యాకల్టీను మెంటార్లగా , మార్గనిర్దేశకులుగా భాబిస్తుంటారు . వీరి పట్ల విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు పూర్తి నమ్మకం కనబరుస్తుంటారు.
విద్యార్థులతో పాటుగా ఎన్ఐఎంఎంఎస్ హైదరాబాద్ క్యాంపస్ ను ప్రశంసించిన గూంజ్ మరియు గ్రామ్ స్వాభిమాన్ ఫౌండర్-డైరెక్టర్ శ్రీ అన్షు గుప్తా మాట్లాడుతూ 'మీరు భారతదేశపు భవిష్యత్ మేనేజర్లు. ఎన్ఎంఐఎంఎస్ వద్ద నేర్చుకున్న మేనేజ్మెంట్ నైపుణ్యాలు మీ ప్రొఫెషనల్ కెరీర్లో కూడా తోడ్పడగలవు. నేడు ఈ ప్రపంచం డాటా ఎనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటివి భవిష్యత్గా నిలువనున్నాయి. ఎన్ఎంఐఎంఎస్ యొక్క డిజిటల్ విధానం ఖచ్చితంగా విద్యార్ధులకు అత్యుత్తమ అవకాశాలను అందించగలవు` అని అన్నారు.
ఎన్ఎంఐంఎస్ హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ తపన్ కె పాండా మాట్లాడుతూ క్యాంపస్లో నాణ్యత వృద్ధి చేయడం పట్ల ప్రయత్నాలను పునరుద్ఘాటించారు. నూతన విద్యా సంవత్సరంలో నూతన కరిక్యులమ్ ఆవిష్కరించడం ద్వారా విద్యార్థుల అభ్యాస అనుభవాలను సమృద్ధి చేస్తున్నట్లుగా వెల్లడించారు. విద్యార్థుల కోసం అనుభవపూర్వక అభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నామని, విద్యార్ధులు భవిష్యత్ కోసం సిద్ధంగా ఉండవచ్చని వెల్లడించారు.
ఈ స్నాతకోత్సవం ఎల్లప్పుడూ గౌరవించతగిన వేడుకగానే ఉంటుంది. ఈ కార్యక్రమం విద్యార్థుల తేజోవంతమైన మనస్సుల్లో చిరస్థాయిగా లిఖించబడుతుంది. ఈ విద్యార్ధులు జీవితం, లక్ష్యాల పట్ల సమగ్రమైన, అభివృద్ధి చెందిన ధృక్పథాన్ని కలిగి ఉండటమే కాదు, బాధ్యత కలిగిన పౌరులుగానూ మారతారు. ఎన్ఎంఐఎంఎస్ ఎస్బీఎం వద్ద వారు పడిన కష్టం, సాధించిన విజయాలు వారి వ్యక్తిగత అభివృద్ధిలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మెరుగైన ప్రతిఫలాన్ని అందిస్తాయి.