Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : డాక్టర్ బిఎన్ రావ్ హెల్త్ ఫౌండేషన్తో కలిసి ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం) ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఆదివారం నగరంలోని రెనీ హాస్పిటల్లో మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ చేసినట్టు ఆ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆర్థికంగా వెనుకబడి, కుటుంబ సమస్యలతో రోగ నిర్ధారణ చేసుకోలేని వారికి ఇది ఉపయోగపడిందని డాక్టర్ బిఎన్ రావు పేర్కొన్నారు. తమ బ్యాంక్ ఎప్పటికీ మహిళలకు మద్దతును అందిస్తుందని బీఓఎం హైదరాబాద్ జోన్ జోనల్ మేనేజర్ ఆర్ జగన్ మోహన్ తెలిపారు.