Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెల్లడి
న్యూఢిల్లీ : కరోనా కాలంలో కొత్తగా 1000 శాఖలు తెరిచామని ప్రయివేటు రంగంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెల్లడించింది. గడిచిన రెండేండ్లలో ప్రతీ రోజు సగటున రెండు శాఖల చొప్పున అందుబాటులోకి తెచ్చామని పేర్కొంది. ఆర్థిక సంవత్సరంలో 2021-22 కొత్తగా 734 శాఖలను స్థాపించామని తెలిపింది. 2022 మార్చి 31న ఒకే రోజు తమ బ్యాంక్ ఎండీ, సీఈఓ శశి జగదీశన్ వర్య్చూవల్గా 250 శాఖలను తెరిచి రికార్డ్ను సృష్టించారని తెలిపింది. గడిచిన మార్చి 31 నాటికి బ్యాంక్ మొత్తం శాఖలను 6,342 విస్తరించిందని వెల్లడించింది.