Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్కతా : గడిచిన ఆర్థిక సంవత్సరం (2021-22) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో బంధన్ బ్యాంక్ రూ.1,902 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.103 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.2,457.4 కోట్లుగా ఉండగా.. క్రితం క్యూ4లో రూ.3,504.2 కోట్లకు చేరింది. 2022 మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీపై ఆదాయం 45 శాతం పెరిగి రూ.2,539 కోట్లుగా నమోదయ్యింది. వడ్డీయేతర ఆదాయం 38 శాతం వృద్థితో రూ.964.4 కోట్లుగా నమోదయ్యింది.