Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో విమాన ఇంధన ధరలు అమాంతం పెరిగాయి. సోమవారం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్) ధర ఏకంగా 5.3 శాతం లేదా రూ.6,188 పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కిలోలీటర్ ధర రూ.123,039.71కు చేరి.. జీవిత కాల గరిష్టం వద్ద నమోదయ్యింది. ప్రస్తుత ఏడాదిలో పది సార్లు ఎటిఎఫ్ ధరలు పెరిగాయి. ఐదు మాసాల్లో ఏకంగా 55 శాతం లేదా రూ.49,017 ఎగిసింది. విమానయాన నిర్వహణలో ఇంధన వాటా దాదాపు 40 శాతంగా ఉంటుంది. అమాంతం పెరుగుతున్న ఎటిఎఫ్ ధరలతో విమానయాన ధరలు మరింత పెరగనున్నాయి.