Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వంట నూనెలు, కూరగాయలు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పటికే ఆకాశాన్ని అంటాయి. చక్కెర ధరలు కూడా ఎగిసిపడనున్నాయనే సంకేతాలతో కేంద్రం పంచదార ఎగుమతుల నియంత్రణపై దృష్టి పెట్టిందని సమాచారం. ఈ క్రమంలోనే ప్రస్తుత ఏడాది చక్కెర ఎగుమతులను కేవలం కోటి టన్నులకే పరిమితం చేసే అవకాశం ఉందని రిపోర్టులు వస్తున్నాయి. భారత్లో ఏడాదికి 35.5 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తి జరుగుతుంది. ఇందులో 9.5 మిలియన్ టన్నుల ఎగుమతికి మాత్రమే అవకాశం ఇవ్వాలని భావిస్తోన్నట్లు సమాచారం. ఇప్పటికే 8 మిలియన్ టన్నులకు ఆర్డర్లు నమోదయ్యాయని తెలుస్తోంది.