Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత్లో టెస్లా కార్ల తయారీని చేపట్టబోమని ఆ కంపెనీ అధినేత, సీఈఓ ఎలన్ మస్క్ స్పష్టం చేశారు. ఇక్కడ టెస్లా కార్యకలాపాలు ప్రారంభించనుందా..? లేదా..? అని ట్విట్టర్లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఎలన్ ఈ సమాధానం ఇచ్చారు. తొలుత తమ కార్లను అమ్మడానికి అనుమతి ఇవ్వకున్నా, తమ కార్లకు సర్వీస్ చేసే అవకాశం ఇవ్వకున్నా, అలాంటి దేశాల్లో తాము ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోమని మస్క్ స్పష్టం చేశారు. దీంతో భారత్కు టెస్లా కార్యకలాపాల విస్తరణ ఉండబోదని తెలిపింది.