Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఈఏ నాగేశ్వరన్ అంచనా
న్యూఢిల్లీ: వచ్చే ఐదేండ్లలో ఆర్థిక వ్యవస్థ రికార్డ్ స్థాయికి పెరగనుందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి అనంత నాగేశ్వరన్ అంచనా వేశారు. 2026-27 నాటికి 5 ట్రిలియన్ డాలర్లకు (దాదాపు రూ.385 లక్షల కోట్లు) వృద్ధి చెందుతుందని పేేర్కొన్నారు. ఆ తర్వాత 2033-34 నాటికి 10 ట్రిలియన్ డాలర్లకు చేరొచ్చన్నారు. ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థితిలో ఉందన్నారు. 2024-25 నాటికే 5 ట్రిలియన్ డాలర్లకు చేరొచ్చని నాలుగేండ్ల క్రితం ప్రధాని మోడీ అంచనా వేశారు. కానీ ఆ లక్ష్యాన్ని చేరలేకపోయారు. 2021-22లో 3.12 ట్రిలియన్ డాలర్లకు పరిమితమయ్యింది.