Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్లో హైదరాబాద్ బ్లాక్బర్డ్స్ రేసింగ్ ఫ్రాంచైజీకి మద్దతునందించేందుకు సుప్రసిద్ధ నటుడు, వ్యాపారవేత్త విజయ్ దేవరకొండను తమ బోర్డ్పైకి తీసుకువచ్చిన ఇండియన్ మోటర్స్పోర్ట్స్ కంపెనీ ఆర్పీపీఎల్
హైదరాబాద్, 25 జూన్ 2022 : ఇండియన్ మోటర్స్పోర్ట్స్ కంపెనీ, ఆర్పీపీఎల్ (రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్) తమ ఫ్రాంచైజీ మోడల్ ఆధారిత ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ను ప్రకటించింది. సుప్రసిద్ధ నటుడు, వ్యాపారవేత్త విజయ్ దేవరకొండ ఇప్పుడు హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీకి మద్దతునందించనున్నట్లు వెల్లడించింది. సుప్రసిద్ధ నటుడు విజయ్ దేవరకొండతో భాగస్వామ్యం, భారతదేశంలో మోటర్ స్పోర్ట్స్ను విప్లవాత్మీకరించాలనే ఆర్పీపీఎల్ యొక్క లక్ష్యం చేరుకునేందుకు సహాయపడుతుంది. ఈ ఫెస్టివల్ నవంబర్ 11వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. పలు ఫ్రాంచైజీలు ఈ ఫార్మాట్లో పాల్గొనడంతో పాటుగా వారాంతాలలో పలు నగరాల్లో జరిగే పోటీల ద్వారా ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నాయి. ఈ పోటీలు రేస్ ట్రాక్లతో పాటుగా స్ట్రీట్ సర్క్యూట్లలో కూడా జరుగనున్నాయి.
ఎంఈఐఎల్ డైరెక్టర్ మరియు ఆర్పీపీఎల్ (రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్) చైర్మెన్ అఖిలేష్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ భారతదేశంలో అపారమైన క్రీడా సామర్ధ్యం ఉంది. కాకపోతే ఆ ప్రతిభ వెల్లడి కావడానికి తగిన అవకాశాలు లేవు. రాబోయే 5–7సంవత్సరాలలో పూర్తి భారతీయ బృందాన్ని ఎఫ్1కు పంపాలన్నది మా లక్ష్యం. అలాగే రాబోయే 10–12 సంవత్సరాలలో పూర్తి భారతీయ మహిళల బృందాన్ని ఎఫ్ 2కు పంపాలన్నది మా లక్ష్యం. విజయ్ దేవరకొండ మాకు మద్దతునందించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. యువత నడుమ అత్యంత ప్రాచుర్యం పొందిన నటుడు ఆయన. విజయవంతమైన చిత్రాల ద్వారా మాత్రమే కాదు, వ్యాపార సంస్థలు,దాతృత్వ కార్యక్రమాల ద్వారా కూడా ఆయన సుప్రసిద్ధులు’’ అని అన్నారు
నటుడు, వ్యాపారవేత్త విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘‘ఈ లీగ్ లో భాగం కావడం పట్ల సంతోషంగా ఉన్నాను. దేశవ్యాప్తంగా క్రీడా ప్రేమికులకు నూతన అవకాశాలను ఇది అందించనుంది. భారతదేశంలో రేసింగ్కు ఇప్పుడు ప్రత్యేక స్థానముంది’’ అని అన్నారు.
భారతదేశంలో తమ అతిపెద్ద ఫార్ములా రేసింగ్ కార్యక్రమానికి తేదీలను ఇటీవలనే ఆర్పీపీఎల్ ప్రకటించింది. ఇండియన్ రేసింగ్లీగ్ లో ఎఫ్ఐఏ సర్టిఫైడ్ ఫార్ములా 4 మరియు ఫార్ములా రీజనల్ ఇండియన్ చాంఫియన్షిప్లు నవంబర్ –డిసెంబర్ 2022 మధ్య జరుగునున్నాయి. ఈ పోటీలు హైదరాబాద్, గ్రేటర్ నోయిడా , కోయంబత్తూరు, చెన్నైలలో జరుగుతాయి.