Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: విమానాశ్ర యాల్లో ప్యాసింజర్లకు సేవలం దించే టెక్నాలజీ ప్లాట్పామ్ డ్రీమ్ఫోక్స్ సర్వీసెస్ ఆగస్టు 24న ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్కు రానుంది. ఈ ఇష్యూలో షేర్ల ధరల శ్రేణీని రూ.308-326గా నిర్ణయించింది. ఆగస్టు 26 వరకు ఐపిఒ తెరిచి ఉంటుందని ఆ కంపెనీ తెలిపింది. సంస్థ ప్రమోటర్లు లిబెరత పీటర్ కల్లట్, దినేష్ నాగ్పాల్, ముకేష్ యాదవ్ ఈ ఇష్యూలో రూ.2 ముఖ విలువ కలిగిన 1,72,42, 368 ఈక్విటీ షేర్లను ఓపెన్ ఫర్ సేల్కు పెడుతోంది. ఇన్వెస్టర్లు ఒక బిడ్లో కనీసం 46 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.