Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలో సుప్రసిద్ధ పురుగుమందుల కంపెనీలలో ఒకటైన ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ అత్యంత శక్తివంతమైన కీటక సంహారి “డిసైడ్” (DECIDE) అనే పురుగుమందును దక్షిణ భారత దేశంలో విడుదల చేసింది. ఈ అత్యంత శక్తివంతమైన కీటక సంహారిణి మిర్చి పంటలో రసం పీల్చే పురుగులపై సమర్ధవంతంగా పనిచేయడంతో పాటుగా రైతులకు నల్లి పురుగు, తామరపురుగు, తెల్లదోమ వంటి కీటకాలపై ఒకే పిచికారి స్ప్రే తో రైతులకు నియంత్రణ అందించటంలో తోడ్పడుతుంది. ‘‘డిసైడ్” ఒక వినూత్నమైన పురుగుమందు. డిసైడ్ ఏకరీతి చర్య కలిగిన రెండు పురుగు మందుల కలయిక. డిసైడ్ను మిత్సుషి కెమికల్స్ జపాన్ మరియు ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ పరస్పర సహకారంతో భారత్ ఉపఖండంలోకి తీసుకుని వస్తుంది. డిసైడ్ ఒక అత్యంత శక్తివంతమైన కీటక సంహారిణి. డిసైడ్ నీటిలో కరిగే గుళికల రూపంలో లభ్యమవుతుంది. మిరప పంటను సోకే రసం పీల్చు పురుగులపై అత్యంత సమర్ధవంతంగా పనిచేయటంతో పాటు, రైతులకు మిరప పంటను సోకే నల్లి, తామరపురుగు మరియు తెల్లదోమల బెడద నుండి ఒకే పిచికారితో కాపాడుతుందని మరియు ఇతర పురగు మందులను కలపాల్సిన అవసరం లేదని ఈ డిసైడ్ ఉత్పత్తిని విడుదల చేసిన అనంతరం ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్, నేషనల్ సేల్స్ హెడ్ శ్రీ అభిషేక్ ధనుకా గారు తెలిపారు. ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ గతంలో ఉత్తర, తూర్పు మరియు పశ్చిమ భారతదేశాలలో 9(3) మాలిక్యూల్ రూపంలో విడుదల చేసింది. దేశంలో మిర్చిపంట దిగుబడి 67% ఉత్పత్తిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో రైతులు సాధిస్తున్నారు. వీరు ఇటీవల నూతన కీటకం నల్లి, తామర పురుగు కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ కీటకాన్ని 2020లో ఎర్ర మిరప పంటలో తొలిసారిగా తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్లో గుర్తించారు. ఈ కీటక సంతతి 2021లో గణనీయంగా పెరిగింది. ఈ కీటకం కారణంగా మిరపమొక్కలో పుష్పించే దశపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా అది ఫలవంతం కాకుండా పోతుంది. ఈ కారణంగా పూలు రాలిపోవటం, పంట దిగుబడి గణనీయంగా తగ్గడమూ జరుగుతుంది. తాజాగా డిసైడ్ కీటక నాశిని ప్రభావాలను గురించి ఆయన మరింత వివరంగా వెల్లడిస్తూ సరైన మొత్తంలో, సరైన నాణ్యత కలిగిన సరైన కీటకనాశినులను వినియోగించడంతో పాటుగా తగిన సమయంలో వాటిని వాడటమూ అత్యంత కీలకం. అప్పుడే పంట తగిన రీతిలో ఎదగడంతో పాటుగా కీటకాల నియంత్రణ కూడా సాధ్యమవుతుంది. ధనుకా కంపెనీ సాంకేతికంగా అత్యంత వైవిధ్యమైన ఉత్పత్తులను కంపెనీ విడుదల చేయడం ద్వారా రైతులు తమ పంటను కాపాడుకునేందుకు మరియు దిగుబడులను పెంచుకునేందుకు తోడ్పడుతున్నాయి. ఇటీవలనే ‘‘కార్నెక్స్” మరియు ‘‘జనెట్” లను సైతం ధనుకా అగ్రిటెక్ సంస్థ విడుదల చేసింది. పెద్ద ఆకులు కలిగిన కలుపు మొక్కలు నియంత్రణతో పాటుగా మొక్కజొన్న పంటలో చిన్న ఆకులతో కూడిన కలుపు మొక్కలు, తుంగ (సైపరస్ రొటండస్) నియంత్రణకు కార్నెక్స్ ఉపయోగపడుతుంది. ఫంగిసైడ్, మరియు బ్యాక్టిరిసైడ్ల వినూత్న సమ్మేళనం. జనెట్, టమోట పంటలో అత్యంత క్లిష్టమైన తెగుళ్ళను ప్రభావవంతంగా నియంత్రిస్తుంది. మహోన్నతమైన పరిశోధన, అభివృద్ధితో పాటుగా పలు యు.యస్, జపాన్, యూరోపియన్ వ్యవసాయ రసాయన కంపెనీలతో భాగస్వామ్యం చేసుకుని ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ ప్రస్తుతం 80పైగా ఉత్పత్తులను మార్కెట్లో అందిస్తుంది.