Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టులో రూ.1.43 లక్షల కోట్ల జీఎస్టీ
- కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో సామా న్యులపై పన్ను వసూళ్ల బాదు డుతో సర్కార్ ఖజానా నిండు తోంది. ప్రతీ వస్తువుపై పన్నుల భారం మోపడంతో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు భారీగా పెరుగు తున్నాయి. వరుసగా ఆరో మాసంలోనూ రూ.1.40 లక్షల కోట్ల పైనా పన్ను వసూళ్లు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుత ఏడాది ఆగస్టులో రూ.1,43,612 కోట్ల జీఎస్టీ వసూళ్లయ్యింది. జులై మాసంలోని రూ.1.49 లక్షల కోట్లతో పోల్చితే 4 శాతం తగ్గినప్పటికీ.. గతేడాది ఇదే ఆగస్టుతో పోల్చితే 28 శాతం పెరుగుదల నమోద య్యిందని గురువారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన నెలలో సీజీఎస్టీ కింద రూ.24,710 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.30,710 కోట్లు, ఐజిఎస్టి రూ.77,782 కోట్లు, సెస్ కింద రూ.10,168 కోట్లు చొప్పున వసూళ్లు అయ్యాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. గడిచిన ఐదు నెలల్లో జీఎస్టీ వసూళ్లలో 33 శాతం పెరిగి రూ.7.46 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత నెలలో వివిధ రాష్ట్రాలతో పోలిస్తే పన్ను వసూళ్లలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. అండమాన్ నికోబార్, లక్ష్యద్వీప్, మణిపూర్ దీవులు మినహా 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పన్ను వసూళ్లలో పెరుగుదల చోటు చేసుకుంది. అండమాన్ నికోబార్ దీవుల్లో మైనస్ 21 శాతం, లక్ష్యద్వీప్లో 73 శాతం, మణిపూర్లో 22 శాతం జీఎస్టీ వసూళ్లు పడిపోయాయి. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్లో 11 శాతం, అసోంలో 10, జమ్ముకాశ్మీర్లో 11 శాతం, రాజస్థాన్లో 10, సిక్కిం 13, తెలంగాణ 10 శాతం చొప్పున జీఎస్టీ వసూళ్లు పెరిగాయి.