Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రభుత్వ కార్యా లయాలను ఖాళీ చేస్తున్నట్లు ఎయిరిండియా వర్గాలు తెలి పాయి. ఈ ఏడాది ప్రారంభం లో ఎయిరిండియా, ఎయిరిండి యా ఎక్స్ప్రెస్ను టాటా గ్రూపు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఆఫీసులను ఈ నెల ప్రారంభం నుంచే ఎయిరిండియా ఖాళీ చేయడం ప్రారంభించినట్టు తెలిపింది. ఈ రెండింటితో పాటుగా ఎయిర్ ఆసియా కూడా తన పలు పాత కార్యాలయాలను ఖాళీ చేస్తుంది. ఈ మూడు విమానయాన సంస్థల కార్యాలయాలను ఒకే దగ్గర ఏర్పాటుచేయాలని టాటా గ్రూపు నిర్ణయించింది. మార్చి 2023 నాటికి గూర్గావ్లో ఏర్పాటు చేసిన సరికొత్త కామన్ ఆఫీసులోకి ఈ మూడింటిని గూర్గావ్లోని వాటికా వన్ ఆన్ వన్ కాంప్లెక్స్లోకి బదిలీ చేయాలని టాటా గ్రూప్ నిర్ణయం తీసుకుంది. టాటా గ్రూప్కి చెందిన మరో విమానయాన సంస్థ విస్తారాకు చెందిన కార్యాలయం కూడా ప్రస్తుత వాటికా వన్ ఆన్ వన్కు పది కిలోమీటర్ల సమీపంలో ఉంది.