Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో పన్ను భారాలు పెరిగాయని ప్రత్యక్ష పన్ను ల వసూళ్ల గణాంకాలు స్పష్టం చేస్తు న్నాయి. పాల నుంచి శ్మాసనాల వరకు ప్రజలను పన్నుల రూపేనా ప్రభుత్వాలు పిండేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను కలుపుకొని ప్రత్యక్ష పన్ను వసూళ్లు 35.46 శాతం పెరిగి రూ.6.48 కోట్లకు చేరాయని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సిబిడిటి) వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో పెట్టుకున్న అంచనాల్లో ఈ మొత్తం 37 శాతానికి సమానం. 2022 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 8 మధ్య కాలంలో రూ.1.9 లక్షల కోట్ల రిఫండ్ చేసినట్లు సీబీడీటీ పేర్కొంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.14.10 లక్షల కోట్ల మేర ప్రత్యక్ష పన్ను వసూళ్లు నమోదయ్యాయి. గడిచిన ఆరు నెలలుగా ప్రతీ మాసంలో రూ.1.4 లక్షల కోట్ల పైగా జిఎస్టి వసూళ్లు జరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం పెట్టుకున్న లక్ష్యం సునాయాసంగా చేరనుందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.