Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆత్మనిర్భర్ భారత్ కోసం ఆత్మ–విశ్వాస్ సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా భారతదేశంలో అతిపెద్ద స్కూల్ ఎడ్టెక్ కంపెనీ లీడ్ నేడు భారతదేశపు మొట్టమొదటి ‘స్టూడెంట్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్’ విడుదల చేసినట్లు వెల్లడించింది. ఈ అధ్యయనం ద్వారా పాఠశాలలకు వెళ్తోన్న విద్యార్ధుల ఆత్మవిశ్వాస స్థాయిని ప్రాంతాలు, నగరాలు, జనాభా మరియు ఇతర అంశాల ఆధారంగా పరిశీలించారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ తో భాగస్వామ్యం చేసుకుని విడుదల చేసిన లీడ్ యొక్క ఇండెక్స్ పలు ఆసక్తికరమైన అంశాలను విద్యార్ధుల ఆత్మవిశ్వాసం పరంగా వెల్లడించింది. ఇండియా ఆత్మవిశ్వాస స్ధాయి 100గా ఉన్న స్కేల్పై 75గా ఉంటే , 36% మంది విద్యార్థులు అత్యున్నత ఆత్మవిశ్వాస స్థాయి (81–100) చూపారు. హైదరాబాద్ ఇండెక్స్ స్కోర్ 87గా ఉంటే, అంబాలా లో ఈ ఇండెక్స్ స్కోర్ 62గా ఉంది. తద్వారా స్కోర్ పరంగా 25 అంతరం చూపడమే కాదు భారతదేశపు మెట్రో నగరాల విద్యార్థులు మెట్రోయేతర నగరాల్లోని తమ సహచర విద్యార్ధులతో పోలిస్తే ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నారు. ఆసక్తికరంగా లీడ్ విద్యార్థులు మెట్రోయేతర నగరాల్లోని తమ సహచర విద్యార్థులతో పోలిస్తూ ఆత్మవిశ్వాస పరంగా అన్ని అంశాలలోనూ మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారు. అంతేకాదు, మెట్రో నగరాల్లోని విద్యార్థులకు మెట్రోయేతర నగరాల్లోని తమ సహచర విద్యార్థులతో పోలిస్తే ఐదు కీలక అంశాలలో ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నారు