Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రుణాలపై వడ్డీ రేట్లను పెంచినట్లు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) ప్రకటించింది. ఖాతాదారులకు అందించే వివిధ రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్)ను 5 నుంచి 35 బేసిస్ పాయింట్ల మేర పెంచినట్లు పేర్కొంది. కొత్త వడ్డీ రేట్లు సెప్టెంబర్ 11 నుంచి అమల్లోకి వచ్చాయని తెలిపింది. దీంతో కొత్త, పాత రుణ గ్రహీతలపై భారం పడనుంది. ఇప్పటికే రుణాలు తీసుకున్న వారిపై వడ్డీరేట్లు పెరగనున్నాయి.