Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ :మొబైల్ ఫోన్ల తయారీదారు మోటారోలా కొత్తగా భారత మార్కెట్లోకి మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రాను విడుదల చేసింది. దీన్ని ప్రపంచంలోనే తొలిసారి 200 మెగాపిక్సెల్ కెమెరాతో ఆవిష్కరించిన ట్లు ఆ కంపెనీ తెలిపింది. అత్యధిక రిజల్యూషన్తో వస్తోన్న వెనుక కెమె రా సెటప్లో ఒఐఎస్ 50 ఎంపి అల్ట్రావైడ్, మాక్రో లెన్స్, 12 ఎంపి టెలిఫోటో లెన్స్, అలాగే అత్యధిక రిజల్యూషన్ 60ఎంపి హై రెస్ సెల్ఫీ కెమెరాతో సహా 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉందని పేర్కొంది. 144హెచ్జెడ్ కర్వ్డ్ పోలెడ్ డిస్ప్లే, 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జిం గ్, స్టీరియో స్పీకర్లు, క్లాస్ లీడింగ్ సెక్యూరిటీతో థింక్షీల్ మోటో స్ట్రాంగ్బాక్స్ దీని ప్రత్యేక ఫీచర్లుగా ఉన్నాయి. సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ధరను రూ. 59,999గా నిర్ణయించింది. పరిమిత కాల ఆఫర్లో భాగంగా రూ. 54,999కు ఇస్తున్నట్లు తెలిపింది.