Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో అధిక ధరలు కొనసాగుతూనే ఉన్నాయి. వ రుసగా 17వ మాసంలోనూ టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యూపీఐ) రెండంకెల స్థాయిలోనే నమోదయ్యి ంది. అహార పదార్థాల ధరలు ఎగిసిపడటంతో ప్రస్తుత ఏడాది ఆగస్టులో డబ్ల్యుపిఐ 12.41 శాతంగా చోటు చేసుకుంది. ఇంతక్రితం నెలలో ఇది 13.93 శాతంగా నమోదయ్యింది. గతేడాది ఆగస్టులో 11.64 శాతంగా ఉంది. గడిచిన నెలలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం జూన్లో 10.77 శాతం ఉండగా.. ఆగస్టులో 12.37 శాతానికి ఎగిసింది. క్రితం ఆగస్టులో కూరగాయల ధరలు 22.37 శాతం పెరిగాయి. ఇంధనం, విద్యుత్తు విభాగాల ద్రవ్యోల్బణం 33.67 శాతంగా చోటు చేసుకుంది. గడిచిన ఆగస్టులో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సీపీఐ) 7 శాతానికి పెరిగింది. హెచ్చు ధరలను అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల మూడు సార్లు వడ్డీ రేట్లను పెంచింది. ఆయినా ధరలు తగ్గుముఖం పట్టకపోవడం ఆందోళనకరం.