Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్ విలువలో నూతన మైలురాయి
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) షేర్లు స్టాక్ మార్కెట్లో పరుగులు పెడుతున్నాయి. ఆ బ్యాంక్ సూచీ ర్యాలీతో రూ.5 లక్షల కోట్ల (5 ట్రిలియన్) మార్కెట్ విలువను చేరిన తొలి ప్రభుత్వరంగ బ్యాంకుగా రికార్డు సృష్టించింది. అన్ని లిస్టెడ్ కంపెనీలను పరిగణనలోకి తీసుకుంటే మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్స్లో ఏడో స్థానంలో నిలిచింది. బుధవారం బీఎస్ఈలో ఎస్బీఐ షేర్ 2.39 శాతం పెరిగి రూ.571.60 వద్ద ముగిసింది. దీంతో ఎస్బీఐ మార్కెట్ కాపిటలైజేషన్ ఏకంగా రూ.5.10 లక్షల కోట్లకు చేరి.. నూతన మైలురాయిని అందుకుంది. ఎస్బీఐ షేర్లు గత కొన్ని రోజులుగా మంచి లాభాల్లో సాగుతున్నాయి. గడిచిన ఏడాదిలో ఆ బ్యాంక్ షేరు 22 శాతం ఎగిసింది. క్రితం మూడు మాసల్లోనూ 26 శాతం పెరిగింది. ఈ కాలంలో బిఎస్ఇ, ఎన్ఎస్ఇ సూచీలు 13.9 శాతం పెరిగిన దాని కంటే ఎస్బీఐ సూచీ ఎక్కువ లాభపడటం విశేషం. 5 ట్రిలియన్ మార్కెట్ కాపిటలైజేషన్కు చేరిన బ్యాంక్ల్లో ఇంతకు ముందు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్లు మాత్రమే ఉన్నాయి. రుణాల్లో వద్ధి పెరుగుతోందని ఆర్బీఐ గణంకాలు బ్యాంక్ల సూచీలకు ప్రధాన మద్దతును అందిస్తోన్నాయి. దేశీయ బ్యాంకుల రుణాలు తొమ్మిదేండ్ల గరిష్ఠానికి చేరాయని ఇటీవల ఆర్బీఐ ఓ రిపోర్ట్ను ఇచ్చింది. ఇది కూడా బ్యాంక్ సూచీలకు ఉత్సాహాన్ని ఇచ్చింది.