Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టాప్ 10లో రెండు పిఎస్యులు
న్యూఢిల్లీ : భారత్లో అత్యంత విలువ కలిగిన బ్రాండ్గా ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అగ్రస్థానంలో నిలి చింది. మార్కెటింగ్ డేటా, అండ్ అనలిటిక్స్ కంపెనీ 'కంటర్ బ్రాండ్జ్' ప్రతీ ఏడాది విడుదల చేసే తొలి 75 అత్యంత విలువైన భారత బ్రాండ్ల నివేదికను గురువారం ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే టిసిఎస్ రెండు స్థానాలు ఎగబాకింది. ఇంతక్రితం ఏడాది హెచ్డీఎఫ్సీ అగ్ర స్థానంలో ఉంది. టాప్ 10 బ్రాండ్లలో ప్రభుత్వ రంగ సంస్థలు ఎస్బీఐ, ఎల్ఐసీలు నిలిచాయి. టీసీఎస్ బ్రాండ్ విలువను రూ.45.52 బిలి యన్ డాలర్లుగా లెక్కించింది. రెండో స్థానంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 32.74 బిలియన్ డాలర్లు, ఇన్ఫోసిస్ 29.22 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉంది. ఎస్పీఐ 13.63 బిలియన్ డాలర్లతో ఐదో స్థా నంలో,12.39 బిలియన్ డాలర్లతో ఎల్ఐసీ ఏడో స్థానంలో నిలిచాయి.