Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ ఏడాది 7 శాతమే..
- ప్రపంచ వృద్థిలోనూ మందగింపు
- ఫిచ్ రేటింగ్స్ అంచనా
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ ముందు అనుకున్నంత అభివృద్థి బాటలో కొనసాగడం లేదని అమెరి కన్ క్రెడిట్ రేటింగ్ ఎజెన్సీ ఫిచ్ తెలి పింది. ఈ క్రమంలోనే దేశ జీడీపీ అంచనాలకు భారీగా కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో దేశ వృద్థి 7 శాతానికి పరిమితం కానుందని తెలి పింది. ఇంతక్రితం జున్లో ఈ అంచనా 7.8 శాతంగా పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ మరింత మందగించి వచ్చే 2023-24లో జీడీపీ ఏకంగా 6.7 శాతానికే పరిమితం కావొచ్చని విశ్లేషించింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు నెమ్మదించడం, ద్రవ్యోల్బణం పెరుగుదల, కేంద్ర బ్యాం క్ల కఠిన పరపతి విధాన నిర్ణయాలు వృద్థి రేటును దెబ్బతీస్తున్నాయని తెలిపింది. ఇంతక్రితం ఈ అంచనా 7.4 శాతంగా ఉంది. గడిచిన ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వృద్ధి రేటును 18.5 శాతంగా ఉండొచ్చని గతంలో అంచనా వేయగా.. అది 13.5 శాతానికే పరిమితం కానుంద ని పేర్కొంది. ఈ ఏడాది ముగింపు నాటికి దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ కూడా 6.2 శాతానికి పెరగొచ్చని అంచనా వేసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 80కి పడిపోవచ్చని పేర్కొంది.
ప్రస్తుత ఏడాది చివరి నాటికి ఆర్బీఐ కీలక రెపోరేటును 5.9 శాతానికి చేర్చనుందని ఫిచ్ అంచనా వేసింది. దేశంలో నమోదవుతున్న హెచ్చు ధరల కట్టడికి వడ్డీ రేట్లను పెంచనుందని పేర్కొంది. కాగా.. ద్రవ్యోల్బణం, ఆర్థిక కార్యకలాపాల్లో క్రమంగా వచ్చే మార్పులకు అను గుణంగా కేంద్ర బ్యాంక్ ఆచీతూచి నిర్ణయాలు తీసుకోనుందని తెలిపిం ది.వచ్చే ఏడాది మొత్తం కీలక వడ్డీరేటు 6 శాతానికి చేరొచ్చని అంచనా వేసింది. 2022-23లో ప్రపంచ జిడిపి పెరుగుదల 2.4 శాతానికి ప రిమితం కావొచ్చని తెలిపింది. క్రితం జూన్ అంచనాలతో పోలిస్తే 0.5 శాతం కోత పెట్టింది. వచ్చే ఏడాది వృద్ధిలోనూ ఒక్క శాతం కోత పెట్టి 1.7 శాతానికి పరిమితం కావొచ్చని తెలిపింది. ఈ ఏడాది చివరి కల్లా బ్రిటన్ ఆర్థికమాంద్యంలోకి జారుకోవచ్చని హెచ్చరించింది. అమెరికా 2023 మధ్య నాటికి స్వల్ప మాంద్యంలోకి వెళ్తుందని విశ్లేషించింది.