Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక పాల ఉత్పత్తిదారుల సంస్థ దశాబ్ద కాలంలో పాలు సరఫరా చేసిన సభ్య రైతులకు సుమారు రూ.27,500 కోట్లు చెల్లించింది
న్యూఢిల్లీ: వ్యక్తిగతంగా వారు చిన్న, సన్నకారు రైతులే కావచ్చు, కానీ గ్రామీణ భారతదేశాన్ని బలోపేతం చేయడానికి నిశ్శబ్ద విప్లవం లాగా, దేశవ్యాప్తంగా 120 జిల్లాల్లో లక్షలాది మంది రైతులు తమ కష్టార్జితాన్ని పైసా పైసా కూడబెట్టి, స్వంతగా వ్యవస్థీకృత పద్ధతిలో ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేసి పాడి పరిశ్రమలోకి సాధికారికంగా ప్రవేశించారు.
నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్ శ్రీ మీనేష్ షా మాట్లాడుతూ '70 శాతానికి పైగా మహిళలు కలిగిన సుమారు 7,50,000 మంది రైతులు హృదయం నిండా సహకార భావనతో, మనస్సు మరియు చేస్తున్న పనిలో ఆ ప్రభావాన్ని రంగరిస్తూ సుమారు 20 పాల ఉత్పత్తి యాజమాన్య సంస్థలను (MPCS) సృష్టించారు. ఒక చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ లో సమ్మిళితమైన ఆ సంస్థలు రాబోయే సంవత్సరాలలో మరిన్ని పెరగబోతున్నాయి. దేశంలోని అగ్రశ్రేణి డెయిరీ ప్లేయర్లలో ఒకటిగా నిలిచేందుకు, ప్రయివేటు సంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ సంస్థలు గతేడాది సుమారు రూ.5,600 కోట్ల వ్యాపారం చేశాయి.
భారత ప్రధాని మోడీ వరల్డ్ డైరీ సమ్మిట్ 2022 ను ప్రారంభించిన సందర్భాన్ని పురస్కరించుకుని భారత హోం శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. 'మొదటి రైతు సంస్థ ప్రారంభమైనప్పటి నుండి, ప్రస్తుతం ఈ సంస్థల సంఖ్య 18కి పెరిగింది. మొత్తంగా రైతు సభ్యులు సరఫరా చేసిన పాలకు చెల్లింపులుగా గత ఆర్థిక సంవత్సరం (2021-2022) వరకు సుమారు రూ. 27,500 కోట్లను వారి వారి సంబంధిత సంస్థలు పాడిరైతులకు చెల్లించాయి` అని అన్నారు.
'ఈ రంగంలో విప్లవాత్మక మార్పు కోసం రైతులు - ముఖ్యంగా గ్రామీణ మహిళలు, ఈక్విటీ వాటాదారులుగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడం, ఆ సంస్థలో పాల సేకరణ నుండి అమ్మకాల వరకు సంస్థాగత కొనుగోలుదారులకు / వినియోగదారులకు పూర్తి విలువను అందించడం, మరియు వారి విలువ ఆధారిత ఉత్పత్తులైన నెయ్యి, వెన్న నుండి పనీర్ వరకు వివిధ ఉత్పత్తులను వారే మార్కెటింగ్ చేయడం - ఇది ఒక సుందరమైన మరియు అద్భుతమైన వాస్తవం.`
'నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ చే ప్రారంభించబడిన శ్వేత విప్లవం వారసత్వాన్ని ఈ పాల ఉత్పత్తిదారుల యాజమాన్య సంస్థలు బహు చక్కగా ముందుకు తీసుకు వెళుతున్నాయని, NDDB స్థాపించిన NDDB డెయిరీ సర్వీసెస్ (NDS) వారి నుండి సాంకేతిక మరియు సంస్థాగత సహాయ సహకారాలను ఈ సంస్థలు అందిపుచ్చుకుని ముందుకు తీసుకువెళుతున్నాయని` షా అన్నారు.
ఇప్పటికే ప్రారంభించబడిన 20 సంస్థలలో 18 సంస్థలు పనిని ప్రారంభించాయి మరియు రోజుకు 40 లక్షల లీటర్లకు పైగా పాలను సేకరిస్తున్నాయి. రానున్న రోజుల్లో, ఈ సంస్థల సంఖ్య మరియు దేశ ప్రజల ఆరోగ్యాన్ని పటిష్టం చేయడానికి అవసరమైన వైట్ ఎక్లెయిర్ (పాలు) పరిమాణం రెండింటిలోనూ గణనీయమైన వృద్ధిని నమోదు చేయబోతున్నాయి.
ఈ రైతులు గత పదేండ్లలో రూ. 175 కోట్లకు పైగా మూలధనంగా సేకరించారు. మొత్తంగా రూ. 400 కోట్లకు పైగా నిల్వలు మరియు మిగులును కలిగి ఉన్నారు. ప్రభుత్వ విధాన యంత్రాంగం మరియు జాతీయ డెయిరీ ప్లాన్, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ వంటి వివిధ పథకాల ద్వారా రాబోయే సంవత్సరాల్లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే జాతీయ లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని షా నొక్కి చెప్పారు.
చట్టం ప్రకారం ఈ సంస్థలను మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీలు అని పిలుస్తారు, అదే కంపెనీల చట్టం 2013 ప్రకారం ప్రయివేటు లిమిటెడ్ సంస్థలు. ఇవి పరస్పర సహాయ సూత్రాల ప్రకారం నడుస్తాయి. స్థానిక సహకార సంస్థలకు మరియు అంతర్జాతీయ సహకార కూటమికి అనుసంధానం చేయబడిన సహకార యాజమాన్యం, సభ్యులకు మాత్రమే పరిమితమైన (బహిరంగంగా మార్కెట్ లో లభించని) షేర్లను కేటాయిస్తూ, సభ్యులకు ప్రోత్సాహకాలను వారి మూలధన వాటాపై కాకుండగా ప్రతి సాంవత్సరిక పాల సరఫరా ప్రాతిపదికన పరిమిత రాబడిని అందజేస్తూ ఉంటాయి.
ఈ కారణంగానే, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఆయా ప్రాంతాల్లోని సహకార సంఘాలకు అందించే రాయితీలతో సహా పూర్తి సహాయాన్ని అందించాలని రాష్ట్రాలకు సూచించినట్లు ఆయన తెలిపారు.
70% కంటే ఎక్కువ మంది భారతీయ పాడి రైతులు 2 లేక 3 పశువులను కలిగి ఉన్నారు మరియు వీరిలో చాలా మందికి ఆవులు మరియు గేదెలు ద్వితీయ ఆదాయ వనరుగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ, ఈ చిన్న మరియు సన్నకారు రైతులు ఉత్పత్తి చేయబడిన పాలకు హామీ ఉన్న మార్కెట్లతో, ఈ సంస్థల ద్వారా అత్యంత పారదర్శక పద్ధతిలో బ్యాంకుల ద్వారా నగదు రహిత చెల్లింపు విధానంతో అత్యధిక ప్రయోజనం పొందుతున్నారు.
ఈ సంస్థ, సభ్యుల నుండి సేకరించిన పాలకు 10 రోజుల వ్యవధిలో నెలకు 3 సార్లు చెల్లిస్తుంది. ఎక్కువగా వ్యవసాయం మరియు వ్యవసాయానికి హాజరయ్యే మగ సభ్యులతో కూడిన కుటుంబంలోని మహిళలు ఇటువంటి పాడి కార్యకలాపాలను చేపట్టడం గమనించవచ్చు.
ఈ రైతు సంస్థలో 5 లక్షల మందికి పైగా మహిళా సభ్యులు ఉన్నారు, వారు తమతమ కుటుంబాలకు రొట్టెలు చేసిపెట్టేవారిగానే కాకుండా కుటుంబ ఆర్ధిక అవసరాలను తీర్చేవారుగా కూడా ఎదుగుతున్నారని, ఇటువంటి పారదర్శకమైన మరియు నగదు రహిత లావాదేవీల యంత్రాంగం ద్వారా, ప్రభుత్వం మహిళా సాధికారత యొక్క నిజమైన అర్ధానికి మరియు తత్వానికి అనుగుణంగా ఉన్నారని షా అన్నారు.
ఈ సంస్థ చేసే అమ్మకాలలో 80 నుండి 85% తిరిగి సేకరించిన పాలకు బదులుగా వారి సభ్యులకు తిరిగి వస్తుంది మరియు ఇది పాడి పరిశ్రమ రంగంలోని అన్ని కంపెనిలలోకెల్లా అత్యధిక వాటా, ఈ 18 కార్యాచరణ సంస్థలలో 12 సంస్థలు పూర్తిగా మహిళా సభ్యులతో ఉండటం గమనార్హం. శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ తిరుపతిలోని పవిత్ర బాలాజీ పాదాల చెంత ఉన్న మొట్టమొదటి మహిళా రైతు సంస్థగా గుర్తింపు పొందింది. ఈ స్పూర్తి తోనే సఖి మరియు ఆశ వంటి ఇతర మహిళా రైతు సంస్థలు మహిళా కేంద్రీకరణను సూచించే పేర్లను పెట్టుకుని రాణిస్తున్నాయి.
NDDB డెయిరీ సర్వీసర్ మేనేజింగ్ డైరెక్టర్ సౌగత మిత్ర మాట్లాడుతూ వచ్చే 3 సంవత్సరాలలో ప్రస్తుతం ఉన్న మరియు కొత్తగా రాబోయే రైతు సంస్థల యొక్క గ్రామాల సంఖ్యను 21,000 నుండి 30,000 కు పెరుగుతుందని, ప్రస్తుతం ఉన్న 7 లక్షల సభ్యుల నుండి 10 లక్షల మంది సభ్యులకు ఎదుగుతుందని, పాల సేకరణ ప్రస్తుతం రోజుకు 40 లక్షల లీటర్ల నుంచి 60 లక్షల లీటర్లకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు తెలిపారు.
NDDB డెయిరీ సర్వీసెస్ సహాయంతో సృష్టించబడిన పాడి రైతుల యాజమాన్యంలోని సంస్థల సంఖ్య ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే 10కి చేరుకుందని, ఈ సంఖ్య 25కి పెరుగుతుందని అంచనా వేస్తున్నామని మిత్ర జోడించారు.